Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh రైతులకు విద్యుత్ సరఫరా చేయాలని మాజీ మంత్రి డిమాండ్…

రైతులకు విద్యుత్ సరఫరా చేయాలని మాజీ మంత్రి డిమాండ్…

by Prakash
Ex-minister demands to supply electricity to farmers

రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, ఓ.డి చెరువు విద్యుత్ సబ్-స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే మా ప్రభుత్వ ధ్యేయం అని జగన్ ప్రభుత్వం రైతుల క్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతుల ఉరి తాళ్ళు, బిగిస్తున్నారని పల్లె ధ్వజమెత్తారు. ప్రస్తుత రబీ సీజన్లో బోరు బావులు కింద పంటలు సాగుచేసిన రైతులకు విద్యుత్తు కోతల కారణంగా సక్రమంగా నీరు సరఫరా కావడం లేదన్నారు. ప్రస్తుతం బోరు బావులు కింద వేరుశెనగ, మొక్కజొన్న, టమోటా, మామిడి, జామ తోటలు వంటి పంటలు నీరందక పూర్తిగా ఎండిపోతున్నాయన్నారు పంటలు చేతికందే సమయంలో రైతులకు కనీసం పెట్టుబడి సైతం చేదికే అందే పరిస్థితులు కనబడలేదు అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ట్రాన్స్కో ఏ.ఈ, కు వినతిపత్రం పల్లె సమర్పించారు.

Advertisements

You may also like

Our Visitor

013924
Total views : 78446

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.