Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana బి.ఆర్.ఎస్ సభకు పోటెత్తిన జనసంద్రం

బి.ఆర్.ఎస్ సభకు పోటెత్తిన జనసంద్రం

by Prakash
kcr meeting at manukonduru

కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంటే తెలుగుదేశం ఎందుకు పుట్టేదని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు నియోజకవర్గం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేశామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు దేశంలో ఎక్కడాలేని విధంగా వేతనంలో 30 శాతం అలవెన్స్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించిన ఫిట్‌నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ ఖర్చులను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు.

Advertisements

You may also like

Our Visitor

039403
Total views : 196675

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: