కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంటే తెలుగుదేశం ఎందుకు పుట్టేదని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మానకొండూరు నియోజకవర్గం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ సహాయం చేశామన్నారు. ట్రాఫిక్ పోలీసులకు దేశంలో ఎక్కడాలేని విధంగా వేతనంలో 30 శాతం అలవెన్స్ను ఇస్తున్నట్లు చెప్పారు. హోంగార్డులకు అత్యధిక వేతనం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అభ్యర్థితో పాటు అభ్యర్థి వెనుక ఉన్న పార్టీని చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే ఆటోలకు సంబంధించిన ఫిట్నెస్ ఛార్జీలు, సర్టిఫికెట్ ఖర్చులను మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు.
Tag:
brs public meeting
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభ సర్వం సిద్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు సుమారు 60000 మంది వస్తారని అంచనా.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తోంది. నేటి నుంచి రెండవ విడత ప్రచార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మొత్తం 54 ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
నేడు సీఎం కేసీఆర్ భద్రాచలం, పినపాక రెండు నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.
ఏజెన్సీ ఏరియాలు కావడం వల్ల కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.





Total views : 78787