గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ఏ-10 నిందితుడిగా డైరెక్టర్ క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. దీంతో పరారీలో ఉన్న ఏడుగురి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేడు గచ్చిచౌలి పోలీస్ స్టేషన్కు క్రిష్ను తీసుకువెళ్లనున్నారు. అనంతరం కేసుకు సంబంధించి క్రిష్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు.