కరీంనగర్ జిల్లా(Karimnagar District)లోని తిమ్మాపూర్ మండలం(Timmapur Mandal) వచ్చునుర్ లో ఈతకు వెళ్లి తండ్రి కొడుకు మరణించారు. లోయర్ మానేరు గుండ్లపల్లి లోని ఎస్ఆర్ కే స్కూల్ కరస్పాండెంట్ చాడ రంగారెడ్డి ఇద్దరు కొడుకులతో కలిసి ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే సమయంలో చిన్న కొడుకు జయ చైతన్య రెడ్డి(Jaya Chaitanya Reddy) నీటిలో మునిగిపోతుండగా లింగారెడ్డి(Lingareddy) కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే నీటి ప్రవాహంలో వీరిద్దరూ మునిగిపోయారు. అయితే వీరిద్దరిని కాపాడేందుకు పెద్దకొడుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయమై ప్రమాదం నుండి బయట పడిన జయకౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.ఘటనపై పోలీసులు(Police) కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: జూబ్లీహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం..!
- అన్నమయ్య జిల్లాలో విషాదం…అన్నమయ్య జిల్లా పుంగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజు వీధిలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిని తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లుగా గుర్తించారు.…
- నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక కావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. నిర్భయ నిధి పథకం ద్వారా జిల్లాలో…
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ కలకలం.రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్నగర్లో కాల్పులు కలకలం సృష్టించాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ఫామ్హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతోందన్న పక్కా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.