కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి..

mla jagadeesh reddy

Advertisements

&NewLine;<p>కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు&period; స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు&period; కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చదు&period; నెరవేర్చినట్లు చరిత్రలో లేదన్నారు జగదీశ్ రెడ్డి&period; రోజులు కాదు కదా 900 రోజులు ఆగిన కాంగ్రెస్ హామీలు అమలు కావని&comma; ప్రజల నుంచి ప్రశ్న రావాలని అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారు&period; ఇవ్వడం చేతకాక దాని నుంచి తప్పించుకునేందుకు అప్పులు చేశారని అంటారని అసెంబ్లీలో నన్ను అడిగితే దానికి సమాధానం నేను చెప్పేవాన్ని అన్నారు&period; విద్యుత్ పై అసెంబ్లీలో చర్చ వాళ్ళు పెట్టడం కాదు నేనే పెట్టి ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నారు జగదీశ్ రెడ్డి&period; కాంగ్రెస్ డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని ఇవ్వలేదని తాము ఇస్తామంటే ఈసీకి ఫిర్యాదు చేశారని ఇప్పుడు పాత పద్ధతి లో వేస్తామని అంటున్నారని అన్నారు&period; డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు&period; అవసరమైతే కొత్త రుణాలు తీసుకోమన్నారు అది కూడా అమలు కాలేదు అన్నారు జగదీశ్ రెడ్డి&period; ధాన్యంకు కింటాకు భోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పారని ఇంతవరకు దాని వూసే లేదనీ విమర్శించారు జగదీశ్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..