ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది.

Advertisements

<p>ప్రధాని మోదీపై నార్వే పత్రిక విషం కక్కింది&period; ఆయనను పాములు ఆడించే వాడిగా చిత్రీకరించింది&period; తమ జాత్యహంకారాన్ని అలా నిరూపించుకుంది&period; నార్వేకు చెందిన ఆఫెన్‌ పోస్టెన్‌ అనే పత్రిక వేసిన ఆ కార్టూన్‌ ఇప్పుడు తీవ్ర విమర్శలకు ఆస్కారం ఇచ్చింది&period; దీనికి కాప్షన్‌గా ఓ తెలివైన&comma; విసిగించే వ్యక్తి అని పేర్కొంది&period; అంతే కాదు&period;&period; భారత విదేశాంగ విధానంపైనా సదరు ఆఫెన్‌ పోస్టెన్‌ పత్రిక అక్కసు వెళ్లగక్కింది&period; ప్రధాని మోదీ సోమ&comma; మంగళవారాల్లో నార్వేలో పర్యటించారు&period; ఈ కార్టూన్‌ మాత్రం ప్రధాని నార్వేకు వెళ్లేకంటే ముందే ప్రచురించారని సమాచారం&period; నార్వే రాజధాని ఓస్లోలో ప్రధాని ఉన్న సమయంలో ఈ కార్టూన్‌ వెల్లడైంది&period; ప్రస్తుతం ఈ కార్టూన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది&period; నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది&period; జాత్యహంకారానికి సదరు కార్టూన్‌ చిహ్నమని నెటిజన్లు మండిపడుతున్నారు&period; యూరోపియన్లు ఇప్పటికీ తమ వలసవాద భ్రమ నుంచి బయటపడలేకపోతున్నారంటూ మరో నెటిజన్‌ ఫైర్‌ అయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.