శ్రీశైలం క్షేత్రపరిధిలో ట్రాఫిక్ పై సమావేశమైన అధికారులు…

Officials meeting on traffic in Srisailam area...

Advertisements

&NewLine;<p>నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్ర పాణిరెడ్డి&comma; ఈవో పెద్దిరాజు అధ్యక్షతన పోలీసులు&comma; దేవస్థానం అధికారులు&comma; సిబ్బంది సమావేశాన్ని నిర్వహించారు&period; ఈ సమావేశంలో ఆలయ ఈవో డి&period;పెద్దిరాజు&comma; ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు&period; ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ మాట్లాడుతూ క్షేత్రానికి సెలవులు&comma; పర్వదిన రోజులలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారన్నారని ఈ నేపథ్యంలో క్షేత్రపరిధిలో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని ట్రాఫిక్ నియంత్రణకై క్షేత్రపరిధిలో మరికొన్ని వాహన పార్కింగ్ ప్రదేశాలు&comma; రూట్ డైవర్షన్స్&comma; సూచికబోర్డులు&comma; పబ్లిక్ అవుటో పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు&period; అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ క్షేత్రపరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరియైన ప్రణాళికలను రూపొందించి అమలు చేయనున్నట్లు తెలిపారు&period; అదేవిధంగా వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు వాటిని తొలగించేందుకు క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలని&comma; దేవస్థానం ప్రైవేటు సెక్యూరిటీని కూడా పెంచాలని&comma; అదనంగా మరో 50 మంది హోమ్ గార్డులను నియమించుకోవాలని ఆలయ ఈవో పెద్దిరాజుకు&comma; అధికారులకు డీఎస్పీ సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు ..