పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శివనామస్మరణతో మారు మోగిన పంచారామ క్షేత్రం ఓం నమశ్శివాయ హర హర మహాదేవ అంటూ ఎంతో కన్నుల పండుగ శోభాయమానంగా స్వామివారి రథోత్సవం సాగింది. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడి లోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాల భాగంగా ఈ రోజు స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు యువ నాయకుడు గ్రంధి రవితేజ భీమవరంలో శోభాయమానంగా సాగుతున్న పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి రథోత్సవం పుష్పాలతో, అరటి గెలలతో అలంకరించిన భారీ రథంతో ఉత్సవం నిర్వహిస్తున్న భక్తులు మేళ తాళాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, బాణాసంచా కాల్పులతో జరుగుతున్న రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న భీమవరం వన్ టౌన్ పోలీసులు స్వామి వారి ఆలయము నుండి నాచువారి సెంటర్ వరకు కోలాహలంగా శివ నామస్మరణతో మహిళా భక్తుల హారతులతో ముందుకు సాగింది.
శివనామస్మరణతో మార్మోగిన పంచారామ క్షేత్రం…
288
previous post




Total views : 61695