Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh సొంతూర్లకు క్యూకట్టిన ఏపీ ప్రజలు.. 

సొంతూర్లకు క్యూకట్టిన ఏపీ ప్రజలు.. 

by Satya
People of AP queued up for home

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ఓటర్లు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌(Hyderabad) నుంచి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో, హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లే రోడ్లన్నీ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. సోమవారం ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. దీంతో, అక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్లందరూ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఫలితంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే హైవేపై వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి.

పోలింగ్‌ తేదీకి ముందు వరుస సెలవులు రావడం కలిసొచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఓటు వేసేందుకు స్వస్థలాలకు వెళ్తున్నవాళ్లు.. కుటుంబసభ్యులతో సహా తరలివెళ్తున్నారు. శనివారం సెకండ్‌ సాటర్‌ డే, ఆదివారం, సోమవారం పోలింగ్‌ సెలవు వచ్చాయి. దీంతో, శుక్రవారం రాత్రి నుంచే రోడ్లమీద రద్దీ పెరిగింది.

కొందరు అభ్యర్థులు హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏపీ ఓటర్లను రప్పించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఇక, సొంత వాహనాలు ఉన్నవాళ్లు.. తమ వాహనాల్లోనే కుటుంబసమేతంగా స్వస్థలాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రోడ్లమీద వాహనాల రద్దీ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వెళ్లడానికి అవకాశం ఉన్న అన్ని రోడ్లమీద ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా వాహనాలు హైవేలపై నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.

ఇక, హైదరాబాద్‌ నుంచి విజయవాడ మధ్య ఉన్న టోల్‌ ప్లాజాలు కిక్కిరిసిపోతున్నాయి. శుక్రవారం రాత్రినుంచే టోల్‌ప్లాజాలన్నీ రద్దీగా మారాయి. టోల్‌ప్లాజాలు దాటేందుకు చాలా సమయం పడుతోంది. ప్రధానంగా చౌటుప్పల్‌, పంతంగి, చిల్లకల్లు, కీసర టోల్‌ప్లాజాల దగ్గర వాహనాల రద్దీ పెరిగిపోయింది. దీంతో, వాహనాల రద్దీకి అనుగుణంగా ఆయా టోల్‌ప్లాజాల్లో కౌంటర్లను కూడా పెంచేశారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..
    రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా…
  • అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం..
    అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది.నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో అర్ధరాత్రి సమయంలో రెండు హుండీలు అపహరించబడ్డాయని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని…
  • విశాఖ జిల్లా ఆనందపురం హైవేపై ఘోర రోడ్డుప్రమాదం..
    విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి మండలం తగరపువలసలో గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రహదారి పక్కన కారు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

020049
Total views : 92142

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.