Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Latest News మసీదుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజకీయ పార్టీలు..

మసీదుల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాజకీయ పార్టీలు..

by Prakash
telangana elections

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని పలు మసీదుల వద్ద వివిధ రాజకీయ పార్టీల నేతలు ముస్లిం సోదరులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. శుక్రవారం ముస్లింల ప్రత్యేక నమాజు ల అనంతరం పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటూ ప్రచారం నిర్వహించారు. పోటాపోటీగా పార్టీల ప్రచార నినాదాలతో మసీదుల వద్ద అభ్యర్థుల అనుచరులు సందడి చేశారు. కాగా అభ్యర్థులు ఒకరికొకరు తారస పడిన ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తమ ప్రచారం ముగించుకుని అక్కడి నుంచి జారుకున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read Also….

Advertisements

You may also like

Our Visitor

014295
Total views : 79764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.