ఆమె ‘పరారీలో ఉన్న నిందితురాలు’…

Jayaprada

Advertisements

&NewLine;<p>ప్రముఖ సినీనటి&comma; మాజీ ఎంపీ&comma; బీజేపీ నాయకురాలు జయప్రదను అరెస్టు చేయాలని ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు పోలీసులను ఆదేశించింది&period; ఆమె &OpenCurlyQuote;పరారీలో ఉన్న నిందితురాలు’ అని అధికారికంగా ప్రకటించింది&period; జయప్రదపై ఉన్న రెండు కేసుల విచారణ నిమిత్తం ఏడుసార్లు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పంపించినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు మండిపడింది&period; జయప్రదను పట్టుకునేందుకు డీఎస్పీ ఆధ్యర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని రాంపూర్‌లోని ఎంపీ&comma; ఎమ్మెల్యేల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి శోభిత్‌ బన్సల్‌ జిల్లా ఎస్పీని ఆదేశించారు&period; జయప్రదను మార్చి ఆరో తేదీన కోర్టులో హాజరుపరచాలని సూచించారు&period; 2019 లోక్‌సభ ఎలక్షన్ల సందర్బంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో జయప్రద మీద రెండు కేసులు నమోదయ్యాయి&period; ఆ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరఫున రాంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి&comma; సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అజాం ఖాన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.