డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం 3వ రోజుకు చేరుకున్న మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు సమ్మె. సమ్మెలో భాగంగా చెవులో పువ్వులు పెట్టుకుని నిరశన తెలిపిన ఉద్యోగులు, కార్మికులు. సంఘీభావం తెలిపిన టిడిపి ముమ్మిడివరం ఇంచార్జీ దాట్ల బుచ్చిబాబు,మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, నాయకులు. అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్న జగన్ పాలన. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని అంగన్వాడీలు, ఉద్యోగులు, కార్మికులు కోరుతున్న న్యాయమైన డిమాండ్ ను కూడా పట్టించుకోక పోవడం జగన్ నిరంకుశ పాలనకు అద్దం పడుతుంది అని దాట్ల బుచ్చిబాబు అన్నారు.
ap news
మాజీ ఎమ్మెల్యే ,ఇంఛార్జి అర్ రమేష్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సు, విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ షరీఫ్ హాజరైనారు. కాబోయే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి సుగావాసి సుబ్రమణ్యం, కడప అమీర్ బాబు, ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన ముక్తియార్, మాజీ టిటిడి పాలకవర్గ సభ్యులు సుగావాసి ప్రసాద్ బాబు,ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అధిక సంఖ్యలో మైనార్టీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరైనారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మార్కెట్ యార్డ్ లో రూ.71 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేసారు. ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఈ షాపింగ్ కాంప్లెక్స్ వలన వ్యాపారులకు వ్యాపార సముదాయం గా మారుతుంది అన్నారు. చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, కూడా అలాగే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్ యార్డ్ చైర్మన్, డైరెక్టర్లు అందరూ సమిష్టిగా పనిచేసి మార్కెట్ యాడ్ బలోపేతానికి కృషి చేయాలి అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు మొదలు పెడుతోంది.. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనికోసం ఏర్పాట్లను ప్రారంభించనుంది. 2019లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది జూన్ 10వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలు, పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రానికి రానున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25 వేల మంది వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గం లో ని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రకు తరలిరాన్నుట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజిని మెరుగ నాగార్జున శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ లో ఛైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో గత నాలుగున్నర సంవత్సరాలో వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే మళ్ళీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు.
సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్ వాడీ వర్కర్స్ ముట్టడించారు. అంగన్ వాడీ టీచర్లను, ఆయాలను సముదాయించడానికి ఎండివో లక్ష్మి కుమారి ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. కార్యాలయం లోపలకి వెళ్లడానికి లక్ష్మి కుమారి ప్రయత్నించినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ అడ్డుపడటంతో వెనుతిరిగారు. శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు కోరినప్పటికీ అంగన్ వాడీ వర్కర్స్ వినకుండా సిఐటియు నాయకులతో కలిసి భైఠాయించారు. అంగన్ వాడీలను రెడ్డిగూడెం ఎస్ ఐ శ్రీను సర్దిచెప్పినప్పటికీ పట్టించుకోకుండా ధర్నా నిర్వహించారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో రూ.6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన రహదారులు, భవనాలను ప్రారంభించారు. గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారని ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సీఎం జగన్ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ కోట్లాది రూపాయలు ఖాతాల్లో వేశారన్నారు.
నేడు ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ
- జనవరి ఒకటి నుంచి 3 వేల పెన్షన్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్
- మిచాంగ్ తుఫాన్ పంట నష్టం, పరిహారంపై చర్చించనున్న కేబినెట్
- ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం 25 లక్షల పెంపునకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి
- పలు సంస్థలకు భూకేటాయింపులకు ఆమోదం తెలపనున్న కేబినెట్
- గ్రూప్- 1 అండ్ 2 ఉద్యోగ నియామకాలపై చర్చ
- తాజా రాజకీయ పరిణామాలు.. ఎమ్మెల్యేలు,మంత్రుల సీట్ల మార్పుపై కేబినెట్ తర్వాత సీఎం చర్చించే అవకాశం.
పశ్చిమగోదావరిజిల్లా, తాడేపల్లిగూడెం సీవీఆర్ కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ పై దౌర్జన్యానికి దిగి ఐడీ కార్డు లాక్కోవడం విషయంలో తమదే తప్పని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, యూనియన్ ఆసుపత్రి ఎండీ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం కారణంగా అయన ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మీడియా ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పిన వైనం. అయన క్షమాపణ చెప్పడంతో పాటుగా అసుపత్రి వద్ద సిబ్బంది ఎవరైతే కెమెరామెన్ పై దౌర్జన్యం చేసి దుర్బాషలాడారో ప్రతీ ఒక్కరి చేతా క్షమాపణలుచెప్పించిన వైనం. అంతకు ముందు ఆసుపత్రి వద్ద వీడియో తీస్తూ ఉండగా కెమెరామెన్ వర్ధన్ ఐడీ కార్డు లాక్కొని దౌర్జన్యం చేసిన యూనియన్ సిబ్బంది. మూకుమ్మడిగా ఆసుపత్రి సిబ్బంది కెమెరామెన్ పై దౌర్జన్యానికి దిగడమే కాక అక్కడికి వచ్చిన కొందరు రిపోర్టర్లు పైన కూడా దురుసుగా ప్రవర్తించడంతో రేగిన వివాదం. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు పెద్ద ఎత్తున యూనియన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని వర్ధన్ కు సంఘీభావం తెలిపి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన వైనం. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, ఆర్డీవో చెన్నయ్య, డీఎం అండ్ హెచ్ వో మహేష్ తదితర జిల్లా అధికారులు దృష్టికి ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యాన్ని తీసుకువెళ్లిన మీడియా మిత్రులు. జిల్లా అధికారులు ఆదేశాలతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న మీడియా మిత్రులతో మాట్లాడిన టౌన్ ఎస్సై సురేందర్ రెడ్డి, ఇంచార్జ్ ఎమ్మార్వో శివ శంకర్ తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎపీయూ డబ్ల్యూ జే జిందాబాద్, ప్రెస్ క్లబ్ జిందాబాద్ అని నినాదాలతో హోరెత్తించి ఆందోళన కొనసాగించిన వైనం. అధికారులు సర్దిచెప్పి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందితో బహిరంగ క్షమాపణ చెప్పించడంతో సర్థుమణిగిన వివాదం. ఈ ఆందోళనలో పిలుపు ఇవ్వగానే ఆసుపత్రి వద్దకు వచ్చిన పోలీసు, రెవిన్యూ అధికారులు వారికి అదేశాలు ఇచ్చి పంపిన జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మీడియా మిత్రులు.
పలమనేరు మున్సిపాలిటీ గంటావూరులో కబ్జాల పర్వం కొనసాగుతోంది. గంటావూరు లో కొంతమంది ప్రభుత్వ స్థలాలను అందినకాడికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గంటావూరులో ప్రభుత్వ స్థలంలో ఓ నేత ఏకంగా సచివాలయం నిర్మిస్తున్నామంటూ ప్రజలను నమ్మబలికి రెండంతస్థుల భవనాన్ని నిర్మించాడు. మరోచోట ప్రభుత్వ లే ఔట్ స్కెచ్ లో ఉన్న రోడ్డునే ఏకంగా అమ్మేశారు. తాజాగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని హిటాచి వాహనంతో చదును చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అక్కడకు వచ్చిన రెవెన్యూ అధికారులను ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానం చెప్పగా మీకు తెలియకుండా పనులు ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. రెవెన్యూ అధికారులు పనులను నిలిపివేశారు.






Total views : 91177