ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35/2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణ చేసి మరియు డీకేటి భూములను శాశ్వత హక్కు పత్రం కల్పిస్తూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలకు సంబంధించి అసైన్డ్ భూములు 8583 ఎకరాలకు గాను,3783 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ అసైన్డ్ భూముల విషయంలో వాటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపు చట్టం-1977 ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. గత మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో అది అమలులోకి రావడంతో అసైన్డ్ భూమల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే భూముల విషయంలో ఇప్పటి వరకూ కఠిన నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయ విక్రయాలకు అధికారికంగా అవకాశం లేదు. వాటిపై ఎప్పటికైనా వారసులకే హక్కు ఉంటుంది. అందుకే అత్యవసరమైనా వాటిని అమ్ముకోలేరు యజమానులు. ఒకవేళ అమ్మినా, అసైన్డ్ భూములకు రేటు ఉండేది కాదు, న్యాయపరమైన చిక్కులుంటాయనే ఉద్దేశంతో తక్కువ రేటుకే వాటిని కొనేవారు కాదు అని భూములు రిజిస్ట్రేషన్లు కూడా కావు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది అని ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది అని ఇలా చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్ఎంపీపీ ధ్వజా రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారామరాజు, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, సినియర్ నాయకులు ఎల్వి మోహన్, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి,రెడ్డి, చిట్వేల్ ఎంపీపీ చంద్ర, మరియు సర్పంచులు, రమణ, వినోద్, పెంచల్ రెడ్డి, శైలజ, మండలాల ఎమ్మార్వోలు, లబ్ధిదారులు తదితరులు భారీగా పాల్గొన్నారు.
ap news
తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. వల్లివేడు పంచాయతీ పరిధిలో మామిడి తోటలపై విరుచుకు పడుతూ పంట నష్టానికి పాల్పడుతున్నాయి. అంతే కాకుండా ఏనుగుల గుంపు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మంగళవారం ఏనుగుల గుంపు ధ్వంసం చేసిన మామిడి చెట్లను పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడారు. పంట నష్ట తీవ్రతను అంచనా వేయాలని సూచించారు. అనంతరం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద ప్రజలు, బాధిత రైతులతో మాట్లాడారు. 10 ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో వచ్చి పంటను నష్టపరచడం ఇది మూడవ సారి అని తెలిపారు. కర్ణాటక సరిహద్దుల నుంచి ఏనుగుల గుంపు వస్తోందని, ఏ క్షణాన్నైనా గ్రామం వైపు వస్తాయేమోనన్న భయం నెలకొందని వారు తెలిపారు. అటవీ సరిహద్దు ప్రాంతాలైపైన అటవీ శాఖ అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందని ప్రజలు కోరారు. వెంటనే చిత్తూరు, తిరుపతి జిల్లాల డీఎఫ్ఓ అధికారులతో మోహిత్ రెడ్డి మాట్లాడారు. అత్యవసరంగా చర్యలు చేపట్టాలని కోరారు. అధైర్య పడకండి.. ఐకమత్యంగా మెలిగి ఫారెస్ట్ అధికారుల సహకారంతో ఏనుగుల గుంపును తరిమేద్దామని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాయంత్రం వేళల్లో పంట పొలాలకు వెళ్ళరాదని సూచించారు. ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఏనుగుల గుంపును త్వరితగతిన తరలింపునకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు, ప్రభుత్వ అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మె చేశారు. రేపల్లె ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని ఏపి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ధర్నా చేశారు. ఈ సదర్భంగా అంగన్వాడీ వర్కర్స్, అండ్ హెల్పర్స్, యూనియన్ సీఐటీయూ ప్రాజెక్టు గౌరవాధ్యక్షులు సిహెచ్.మణిలాల్ లు మాట్లాడుతూ సమ్మెలోకి వెళుతున్నట్లు సమ్మె నోటీసులు పలుదపాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం స్పదించకపోవటంతో తప్పని పరిస్థితుల్లో సమ్మె చేయాల్సినా పరిస్థితి వచ్చిందని, రోజువారి పని ఒత్తిడి పెరగటం మరియు యాప్స్ పేరుతో తీవ్రమైన ఇబ్బందులు అంగన్వాడి వర్కర్స్ పడుతున్నారు అని అన్నారు. రోజువారీ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నవి, అయినప్పటికీ వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా కన్నా 1000 ఎక్కవ వేతనం ఇస్తామన్నా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేస్తుందన్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, లబ్ధిదారులకు అవసరమైన నాణ్యమైన ఫుడ్ సరఫరా చేయటం లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక పలుదఫాలు ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మెలో చేయలిసినా పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి అంగన్వాడీలా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పల్నాడు జిల్లా గురజాలలో అంగన్వాడీలకు జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్ల మూసివేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నుండి గురజాల రెవిన్యూ డివిజన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమ జీతాలు వెంటనే పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ముఖ్యంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువగా జీతం ఇస్తామని హామీ ఇచ్చారని , కానీ ఇంత వరకు జీతాలు పెంచలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ఈ సమ్మెను కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశ్నించిన వారిని పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీ భూములను కూడా ఆక్రమించుకుని దోచేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్వలపేక్షతో కాకుండా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందని తెలిపారు. మంగళగిరిలో ఓటమి భయంతోనే బీసీ కార్డును తెరపైకి తెచ్చారని మంగళగిరిలో వైసిపి ఓటమికి జనసేన కచ్చితంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ దురుద్దేశంతోనే బీసీలను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. రాబోయే రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే మంగళగిరిలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఎన్నికల పోటీ చేసే విషయంలో జనసేన పార్టీ అధిష్టాన నిర్ణయమే మాకు శిరోధార్యమని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కోటికలపుడి గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. ఎంపీ స్వార్థానికి రోడ్డు మూసేయటం పై నిరసన తెలపడానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారిపై కేసును ఎత్తు వేయకపోతే చలో విశాఖపట్నం చేపడతామన్నారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నారని, ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన సమస్యలను తీర్చడం కానీ, ఇలా వారి అవసరాల కోసం రోడ్లను సైతం మూసివేసి సైకో పాలన చేస్తున్నారని పద్ధతి మార్చుకోకపోతే 2024లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
నాదెండ్ల మనోహర్ అరెస్టు ను పుంగనూరు జనసేన ఇంచార్జి, గంగాధర్ ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంగాధర్ మాట్లాడుతూ విశాఖపట్నం లో టైక్వాన్ జంక్షన్ మూసివేసిన ప్రభుత్వం, ఈ విదంగా మూసివేయడం వల న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమం లో ఆ జంక్షన్ ను తిరిగి తెరిపించాలనే కోణం లో శాంతియుతంగా సమస్య ను పరిష్కరించడానికి వెళుతున్న నాదెండ్ల మనోహర్ ను అక్రమ అరెస్టు చేశారని వాపోయారు. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ యొక్క అక్రమ అరెస్టు నియోజకవర్గ స్థాయి లో మా జనసేన కార్యకర్తలు ఖండిస్తూ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న అని జనసేన పార్టీ ఇంచార్జి సి.గంగాధర్ తెలిపారు.
తమ అథినేత నాదెండ్ల మనోహర్ ను విశాఖపట్నం టైకూన్ సెంటర్లో వైజాగ్ పోలీసులు నిర్భందించినందుకు తెనాలిలో జనసైనికులు, వీరనారీమణులు, తెదేపా సభ్యులు ఆందోళనకూ దిగి మార్కెట్ సెంటర్లో రాస్తారోకో చేసి థర్నాకు దిగారు. తర్వాత జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను వదలివేయటం జరిగింది. ఏమిటీ విశాఖ టైకూన్ సెంటర్ వివాదం ? విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ నుండి విఐపి రోడ్డుకు వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేసారు. నాలుగు నెలల క్రితమే టైకూన్ సెంటర్ వద్ద రోడ్డును మూసేసారు. అయితే ఇలా హటాత్తుగా ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయాడానికి, ఇదే రోడ్డులో నిర్మిస్తున్న వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణకి భవనమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ భవనానికి వాస్తు దోషం వుందని ఏకంగా రోడ్డునే మూసేసారని ఆరోపిస్తున్నారు. ప్రజా ప్రతినిధుల ఆస్తులను అధికారులు ప్రజలు ఉపయోగించే రోడ్డును మూసేయడం దారుణమని జనసేన నాయకులు అంటున్నారు.
లంక భూములకు మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పట్టాలు పంపిణీ చేశారు. ఏళ్ళనాటి కల నెరవేరింది అంటు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఐదంమండలాల్లో 1209 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. 19 సొసైటీలకుగాను 793.27ఎకరాలకు గాను 1209 మంది లబ్దిదారులకు లంకపట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వసంతవెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నోఎళ్ళనుండి ఎటువంటి ఆదారం లేకుండా లంకభూములను సాగుచేసుకుంటున్న పెదల కల నెరవేరింది అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు రెవిన్యూ యంత్రాంగం అంతా కష్టపడి ఎలాంటి అవకతవకలు లేకుండా నిబద్ధతతో ఎంక్వయిరి చేసి లబ్దిదారుల ఎంపిక చేశారన్నారు. ఇంకా కొన్ని సొసైటీలో చిన్నచిన్న అవకతవకలు ఉంటే వాటిని సరిచేయడానికి కొద్దిగా సమయం పడుతుంది. త్వరలో వారికి కూడా ఖచ్చితంగా పట్టాలు పంపిణీ చేస్తామ న్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ మాట్లాడుతూ అర్హులైన పేదల లంక భూములకు పట్టాలు పంపిణీ లో స్థానిక రెవెన్యూశాఖ సిబ్బంది చాలా బాగా పనిచేశారన్నారు. పంపిణీ విషయంలో ఏవైనా అనర్హులుగా ఉండి పట్టాలు తీసుకుని ఉంటే నా దృష్పికి తీసురావచ్చని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్తున్న పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ని అడ్డుకొని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు. వైజాగ్ ఎంపీ లేఅవుట్ వేశారు. దాన్ని కి అన్ని హంగులు సమకూర్చి అమ్ముకోవటానికి, వాస్తు అడ్డు వచ్చినదాని రోడ్డు మూశారు. ఆ రోడ్డు వల్ల ప్రజలు నాలుగైదు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వచ్చింది. దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్న నాదెండ్ల మనోహర అడ్డుకొని, అరెస్టు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కుని కాలరాయకూడదు. పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టు చేయటానికి బోర్ర వెంకట అప్పారావు తీవ్రంగా ఖండించారు






Total views : 90626