Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

by
mla

ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35/2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్ భూములు క్రమబద్ధీకరణ చేసి మరియు డీకేటి భూములను శాశ్వత హక్కు పత్రం కల్పిస్తూ తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు మండలాలకు సంబంధించి అసైన్డ్ భూములు 8583 ఎకరాలకు గాను,3783 లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తూ అసైన్డ్ భూముల విషయంలో వాటిని అమ్ముకునే హక్కు కూడా లబ్ధిదారులకు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ భూ బదలాయింపు చట్టం-1977 ని సవరిస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. గత మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోగా ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో అది అమలులోకి రావడంతో అసైన్డ్ భూమల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అని ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే భూముల విషయంలో ఇప్పటి వరకూ కఠిన నిబంధనలు ఉండేవి. ప్రభుత్వం అసైన్ చేసిన భూముల క్రయ విక్రయాలకు అధికారికంగా అవకాశం లేదు. వాటిపై ఎప్పటికైనా వారసులకే హక్కు ఉంటుంది. అందుకే అత్యవసరమైనా వాటిని అమ్ముకోలేరు యజమానులు. ఒకవేళ అమ్మినా, అసైన్డ్ భూములకు రేటు ఉండేది కాదు, న్యాయపరమైన చిక్కులుంటాయనే ఉద్దేశంతో తక్కువ రేటుకే వాటిని కొనేవారు కాదు అని భూములు రిజిస్ట్రేషన్లు కూడా కావు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త చట్టం తెస్తోంది. అందులో భాగంగానే ఆర్డినెన్స్ ని తీసుకొచ్చింది అని ప్రభుత్వం భూములు అసైన్ చేసి 20ఏళ్లు దాటితే వాటిని అమ్ముకునే అవకాశాన్ని యజమానులకు కల్పిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అని ఈ నిర్ణయాన్ని కూడా తాజా ఆర్డినెన్స్ లో పేర్కొంది అని ఇలా చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రభుత్వ విప్ శాసనసభ్యుల కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి, వైస్ఎంపీపీ ధ్వజా రెడ్డి, ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, చిట్వేల్ మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బారామరాజు, జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు, సినియర్ నాయకులు ఎల్వి మోహన్, ప్రతాప్ రెడ్డి, రాజారెడ్డి,రెడ్డి, చిట్వేల్ ఎంపీపీ చంద్ర, మరియు సర్పంచులు, రమణ, వినోద్, పెంచల్ రెడ్డి, శైలజ, మండలాల ఎమ్మార్వోలు, లబ్ధిదారులు తదితరులు భారీగా పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026060
Total views : 149833

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.