బీఆర్ఎ్సను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా? ఎర్రబెల్లి దయాకర్రావు చేరికకు సీఎం రేవంత్ ఓకే చెప్పారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పని చేసిన ఎర్రబెల్లి దయాకర్రావు, రేవంత్రెడ్డి మధ్య నోటుకు ఓటు కేసు సమయంలో విభేదాలు తలెత్తాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీని వీడి బీఆర్ఎ్సలో చేరి, ఐదేళ్లు మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్ఎస్ కేడర్ నైరాశ్యంలో ఉండగా.. కీలక నేతలు తలోదారి చూసుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే అదనుగా బీఆర్ఎ్సలోని కీలక నేతలను చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
ఈ నేపథ్యంలో తొలుత ఇద్దరు మంత్రులతోపాటు ఐదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రె్సలోకి ఎర్రబెల్లిని తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపినా.. సీఎం రేవంత్ వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎ్సను వీడి కాంగ్రె్సలో చేరటమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడటంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్రావు జిల్లాలో బీఆర్ఎ్సకు పెద్ద దిక్కుగా నిలిచారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి