కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం…

The aim of the state government is to provide medical services at the corporate level

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడమే లక్ష్యమని ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు &period;పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 142 కోట్ల సింగరేణి నిధులతో నూతనంగా నిర్మించే ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి రామగుండం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ తో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు&period; ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు&period; రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాలకు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ కళాశాలను సైతం మంజూరు చేసిందని అన్నారు&period; ప్రతి తెలంగాణ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు&period;ఇప్పటి వరకు పెద్దపల్లి జిల్లాలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పెంచిన తర్వాత సుమారుగా రెండు వేల మంది చికిత్స పొందారని అన్నారు&period;రామగుండం కార్పోరేషన్ పరిధిలో అవసరమైన చోట బస్తీ దవాఖానాలు ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు&period;<br>ఎమ్మెల్యేగా ఎం&period;ఎస్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు &comma;సంస్థ చొరవతో ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు జరిగిందని గుర్తుచేశారు&period;సింగరేణి సంస్థ సహకారంతో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…