అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి, గద్దెగూడెం, అడవి అజిలాపూర్, కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలు మంగలహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014 వరకు నియోజకవర్గం ఎడరిగా ఉండేదని ఇప్పుడు పచ్చన్ని పొలాలతో కళకళ లాడుతుంది. కోయిల్ సాగర్ నుండి వెంకటయ పల్లి మీదిగా కెనాల్ పనులు కేసుల కారణంగా ఆలస్యం అయిందని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు, వెంకటాయపల్లి ఒక్క గ్రామానికి 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 20 మందికి గృహలక్ష్మి మరియు దళిత బంద్, బిసి బంద్ లాంటి పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటల కరెంటు వస్తుందని, రైతుబంధు లాంటి పథకాలు ఆపివేస్తారు. కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..ఈ నెల 6 న దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు, ఎంపీటీసీ పార్వతమ్మ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…
ఎన్నికల ప్రచారంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి
301
previous post





Total views : 76819