Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh తిరుపతిలో రాత్రి వేళ భారీ నగదు చోరీ…

తిరుపతిలో రాత్రి వేళ భారీ నగదు చోరీ…

by Prakash
theft

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని రాజుల కండ్రిగ గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు భారతి, జీ.రాజేంద్ర రాజు ఇంట్లో చొరబడి 56 సవరల బంగారం, 7 లక్షల రూపాయలు నగదు దొంగతనం జరిగిందని తెలిపారు. బాధితులు రాజేంద్ర రాజు, భారతి బుధవారం ఉదయం ఇంట్లో చోరీ జరిగినట్లు నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు భారతి, రాజేంద్ర రాజు వారి కుమారుడు అనిల్ ను విచారించగా తమిళనాడు తిరువళ్లూరుకు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి ఇంటిలో చూడగా 56 సవరల బంగారం, 7 లక్షల రూపాయల నగదు చోరీ అయినట్లు పోలీసులకు తెలిపారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడిన సంఘటన సీసీ కెమెరాలలో నమోదయినట్లు బాధితులు తెలిపారు. దొంగల కోసం ఫింగర్ ప్రింట్, ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039485
Total views : 197109

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: