Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home TelanganaHyderabad ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డ్..

ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డ్..

by Rama
Gadhe Sai Lenin

గోదావరిఖని (Godavarikhani):

పెద్దపల్లి జిల్లా గోదావరిఖ (Godavarikhani)ని చెందిన గాదే. సమ్మయ్య సింగరేణి ఉద్యోగి వారి కుమారుడు గాదే సాయి లెనిన్ ఓకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యొగాలు సాదించి రికార్డ్ సృష్టించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన నాలుగు పోటీ పరీక్షలలో ఉద్యోగం సాధించిడంతో పాటు సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన సమ్మయ్య సింగరేణి ఓపెన్ కాస్ట్ 1 లో ఎలక్ట్రికల్ ఫోర్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని కుమారుడు సాయి లెనిన్ గోదావరిఖనిలో పదో తరగతి వరకు విద్యను అభ్యసించాడు. ఇంటర్ హైదరాబాదులో, బీటెక్ వరంగల్ లో పూర్తి చేసిన లెనిన్ గేట్ ద్వారా హైదరాబాద్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసాడు.

Follow us on :Facebook, Instagram& YouTube.

ఈ క్రమంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన గోదావరిఖని ఎక్సైజ్ సిఐ స్ఫూర్తితో పోటి పరీక్షలకు సిద్ధమయ్యాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్, పాలిటెక్నిక్ లెక్చరర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, గ్రూప్ 4 పరీక్షలకు ప్రిపేర్ అయి హాజరయ్యారు. దీంతోపాటు సింగరేణి సంస్థ నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పరీక్షల్లో సైతం విజయం సాధించి ప్రస్తుతం కైరిగూడ ఓపెన్ కాస్ట్ గనిలో పనిచేస్తున్నారు. ఒకేసారి ఐదు ఉద్యోగాలు సాధించిన సాయి లెనిన్ ను కాలనీవాసులు ఘనంగా సన్మానించారు. తన విజయానికి తల్లిదండ్రులతో పాటు, ఎక్సైజ్ సిఐ రమేష్ ప్రోత్సాహం మరువలేనిదని లెనిన్ తెలిపారు. తన కుమారుని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు అందరూ పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని లెనిన్ తల్లిదండ్రులు పేర్కొన్నారు.. Read Also..

  • ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..
    ఆదిలాబాద్ పట్టణ రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మురికి కాలువలు, అంతర్గత రోడ్లు, గాంధీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే…
  • రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి .
    విద్యపై తాము పెట్టేది ఖర్చు కాదన… పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారాయన. ఆరుట్ల గ్రామం ఇప్పుడు రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.…
  • ఆర్డీఎస్ ఆనకట్టను పరిశీలించిన కేఆర్ఎంబీ ఇంజనీర్ల బృందం.
    జోగులాంబ గద్వాల జిల్లాలోని రైతులకు జీవనాడిగా భావించే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్‌ అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఇంజనీర్ల బృందం పరిశీలించి, మూడు రాష్ట్రాల అధికారులతో కీలక సమీక్ష నిర్వహించింది.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

025636
Total views : 147571

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.