ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఎంపీ అభ్యర్థులు గా కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తుండటం తో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కష్ట పడిన వారిని కాదని అసలు ఏ పార్టీయో తెలియని వ్యక్తుల పేర్లు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు గా వినిపిస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గా గత ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కు కృషి చేసిన వ్యక్తి పేరుతో పాటు అసలు రాజాకీయాలకు దూరంగా ఉన్న మరో వ్యక్తి పేరు వినిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇంతకాలం ఉన్న నాయకులు ఏం చేయాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడే వారు లేరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన నాయకులు జిల్లాలో ఉన్నారు. వారందరినీ కాదనీ కొత్త వ్యక్తులకు ఎంపీ టిక్కెట్ కేటాయిస్తున్నారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా పునరాలోచించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారికి ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కేటాయించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అసలు పార్టీలో లేని వారికి, గత ఎన్నికల్లో BRS అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన వారికి టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గా చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి