ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఎంపీ అభ్యర్థులు గా కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తుండటం తో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కష్ట పడిన వారిని కాదని అసలు ఏ పార్టీయో తెలియని వ్యక్తుల పేర్లు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు గా వినిపిస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గా గత ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కు కృషి చేసిన వ్యక్తి పేరుతో పాటు అసలు రాజాకీయాలకు దూరంగా ఉన్న మరో వ్యక్తి పేరు వినిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇంతకాలం ఉన్న నాయకులు ఏం చేయాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడే వారు లేరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన నాయకులు జిల్లాలో ఉన్నారు. వారందరినీ కాదనీ కొత్త వ్యక్తులకు ఎంపీ టిక్కెట్ కేటాయిస్తున్నారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా పునరాలోచించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారికి ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కేటాయించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అసలు పార్టీలో లేని వారికి, గత ఎన్నికల్లో BRS అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన వారికి టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గా చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనంతపురం జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ల దందా..ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని…
- అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ…
- ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో కూలీలతో కలిసి స్వయంగా పని చేసి ఆకట్టుకున్నారు.వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి.. వారికి…




Total views : 61931