21
ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో కూలీలతో కలిసి స్వయంగా పని చేసి ఆకట్టుకున్నారు.వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి.. వారికి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరును కూడా మార్చారని పేర్కొన్నారు.కేంద్రం తీసుకొస్తున్న కొత్త మార్పులతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.





Total views : 62069