Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home TelanganaKhammam కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి పై వీడని ఉత్కంఠ..

కాంగ్రెస్ పార్టీలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి పై వీడని ఉత్కంఠ..

by Rama
Congress Party

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధి పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఎంపీ అభ్యర్థులు గా కొత్త వ్యక్తుల పేర్లు వినిపిస్తుండటం తో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కష్ట పడిన వారిని కాదని అసలు ఏ పార్టీయో తెలియని వ్యక్తుల పేర్లు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు గా వినిపిస్తుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గా గత ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గెలుపు కు కృషి చేసిన వ్యక్తి పేరుతో పాటు అసలు రాజాకీయాలకు దూరంగా ఉన్న మరో వ్యక్తి పేరు వినిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఇంతకాలం ఉన్న నాయకులు ఏం చేయాలని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడే వారు లేరా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ అధికారంలో లేకపోయినా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడిన నాయకులు జిల్లాలో ఉన్నారు. వారందరినీ కాదనీ కొత్త వ్యక్తులకు ఎంపీ టిక్కెట్ కేటాయిస్తున్నారనే దానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధిష్టానం ఇప్పటికైనా పునరాలోచించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారికి ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కేటాయించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. అసలు పార్టీలో లేని వారికి, గత ఎన్నికల్లో BRS అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన వారికి టిక్కెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గా చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
    ఇక్కడ బాలికది సాధారణమైన గర్భంకాదు.. అత్యాచారం చేయబడి గర్భం దాల్చింది. తన గర్భంలో పెరుగుతున్నదీ..పెంచుతున్నదీ నిందితుడి ప్రతిరూపం..గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తే..తల్లీ బిడ్డల ప్రాణాలకు హాని జరుగొచ్చు..లేదా తల్లి క్షేమంగా ఉన్నా…బిడ్డ చనిపోతే…భ్రూణ హత్య ..అదీ సరికాదు…సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏవైనా సరే..…
  • బెంగాల్లో మరోసారి విజయం మాదే -మమత..
    పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్..టీఎంసీ ఘన విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో 226 కంటే ఎక్కువ సీట్లను టీఎంసీ గెలుస్తుందని స్పష్టం చేశారు. ‘మా-మాటి-మానుష్’ స్ఫూర్తితో టీఎంసీ ప్రభుత్వాన్ని తిరిగి…
  • కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో మరోసారి వివాదం..
    బ్రహ్మంగారిమఠం వివాదం మళ్ళీ మొదలైంది. తాత్కాలిక పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి పూర్వపు పీఠాధిపతి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మారుతి మహాలక్ష్మి నివాసం ఉంటున్న గృహానికి గుర్తుతెలియని వ్యక్తులు…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

009338
Total views : 61688

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.