జగన్, వెలంపల్లి అవినీతి గురించి పోతిన మహేష్ కే ఎక్కువ తెలుసని జన సేన సమన్వయ కర్త అమ్మి శెట్టి వాసు (Ammisetty Vasu) అన్నారు. గత ఐదేళ్లుగా వారిద్దరి అవినీతి గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విషయాలు చెప్పిన మహేష్ కు వైసిపి లో చేరగానే వారిద్దరూ పునీతులు ఐపోయారా.. అని వాసు ప్రశ్నించారు. జన సేన వీర మహిళలు మల్లెపూడి విజయలక్ష్మి, తిరుపతి అనూష తో కలసి వాసు మీడియాతో మాట్లాడారు. జగన్, వెలంపల్లి అవినీతి పై మహాష్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం మహేష్ వైసిపికి పే టీమ్ బ్యాచ్ గా మారిపోయారని, అప్పటి వరకు అవినీతి పరులైన వారు ఆయన పార్టీ మారగానే దేవుళ్ళు ఐపొయారా అని వాసు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, ఆస్తుల గురించి మహేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మరో సారి ఇదే విధంగా ఆయన వ్యవహరిస్తే మాత్రం జన సైనికులు మహేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అంతే కాదు మహేష్ చేసిన అవినీతి. మోసాల చిట్టాను కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచేందుకు బీజేపీ తరఫున రంగం లోకి దిగిన సుజనా చౌదరి గురించి మాట్లాడితే సహించబోమని, ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందన్న విషయాన్ని నియోజక వర్గ ప్రజలు అంగీకరి స్తున్నారని వాసు అన్నారు. పార్టీలో ఉంటూనే వైసిపి కి మహేష్ కోవర్టుగా పనిచేశారని వాసు అన్నారు. పవన్ పొత్తు ప్రకటన చేశాక టపాసులు కాల్చింది పోతిన కాదా అన్నారు. మహేష్ కోసం చంద్రబాబు తన సీట్లు త్యాగం చేసింది గుర్తు లేదా అని వాళ్ల నాయకులను ఒప్పించింది నిజం కాదా అని వాసు ప్రశ్నించారు. పశ్చిమం లోని 22 డివిజన్ల జనసేన అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి