జగన్, వెలంపల్లి అవినీతి గురించి పోతిన మహేష్ కే ఎక్కువ తెలుసని జన సేన సమన్వయ కర్త అమ్మి శెట్టి వాసు (Ammisetty Vasu) అన్నారు. గత ఐదేళ్లుగా వారిద్దరి అవినీతి గురించి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నో విషయాలు చెప్పిన మహేష్ కు వైసిపి లో చేరగానే వారిద్దరూ పునీతులు ఐపోయారా.. అని వాసు ప్రశ్నించారు. జన సేన వీర మహిళలు మల్లెపూడి విజయలక్ష్మి, తిరుపతి అనూష తో కలసి వాసు మీడియాతో మాట్లాడారు. జగన్, వెలంపల్లి అవినీతి పై మహాష్ కు ఉన్నంత అవగాహన మరెవరికీ లేదన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం మహేష్ వైసిపికి పే టీమ్ బ్యాచ్ గా మారిపోయారని, అప్పటి వరకు అవినీతి పరులైన వారు ఆయన పార్టీ మారగానే దేవుళ్ళు ఐపొయారా అని వాసు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల గురించి, ఆస్తుల గురించి మహేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మరో సారి ఇదే విధంగా ఆయన వ్యవహరిస్తే మాత్రం జన సైనికులు మహేష్ ఇంటిని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అంతే కాదు మహేష్ చేసిన అవినీతి. మోసాల చిట్టాను కరపత్రాల రూపంలో ఇంటింటికీ పంపిణీ చేస్తామన్నారు. పశ్చిమ నియోజక వర్గాన్ని అభివృద్ధి పరచేందుకు బీజేపీ తరఫున రంగం లోకి దిగిన సుజనా చౌదరి గురించి మాట్లాడితే సహించబోమని, ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయిందన్న విషయాన్ని నియోజక వర్గ ప్రజలు అంగీకరి స్తున్నారని వాసు అన్నారు. పార్టీలో ఉంటూనే వైసిపి కి మహేష్ కోవర్టుగా పనిచేశారని వాసు అన్నారు. పవన్ పొత్తు ప్రకటన చేశాక టపాసులు కాల్చింది పోతిన కాదా అన్నారు. మహేష్ కోసం చంద్రబాబు తన సీట్లు త్యాగం చేసింది గుర్తు లేదా అని వాళ్ల నాయకులను ఒప్పించింది నిజం కాదా అని వాసు ప్రశ్నించారు. పశ్చిమం లోని 22 డివిజన్ల జనసేన అధ్యక్షులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…




Total views : 149185