ఎస్సై కొట్టడంతో వ్యక్తి మృతి….

A person died after being hit by an SI

Advertisements

&NewLine;<p>దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి చెందాడు&period; చింతపల్లి ఎస్సై కొట్టడం వలనే చనిపోయాడని వెంటనే ఆ ఎస్సైను సస్పెండ్ చేయాలని బంధువులు దేవరకొండ ఆసుపత్రి ముందు నిరసన చేయడంతో ఆసుపత్రి గేటుకు తాళం వేసి లోపలికి ఎవ్వరినీ రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు… అందుబాటులో లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్న చింతపల్లి ఎస్సై మరియు సీఐ లు&period; వివరాల్లోకి వెళ్తే&&num;8230&semi; దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గ్రామ పంచాయతీ పాలెం తాండలకు చెందిన నేనావత్ సూర్య నాయక్&lpar;60&rpar; అన్నదమ్ములు భూవివాదంలో ఆదివారం స్థానిక చింతపల్లి పోలీస్ స్టేషన్ లో సూర్య నాయక్ తమ్ముడు నేనావత్ భీమా నాయక్&comma; సూర్య నాయక్ పై పిర్యాదు చేయగా&comma; చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి సూర్య నాయక్ ను స్టేషన్ కు పిలిపించి విచక్షణరహితంగా పోలీస్ స్టేషన్ లో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోవడంతో పోలీస్ సిబ్బంది&comma; అతని కుటుంబ సభ్యులు కలిసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలిస్తున్న మార్గ మధ్యలోనే అతను మృతి చెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది&period; అయితే సూర్య బంధువులు దేవరకొండ ఆసుపత్రి నుండి మృత దేహాన్ని తరలించి చింతపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహిస్తామని తెలియజేయడంతో మృతదేహాన్ని తరలించకుండా పోలీసులు అడ్డుకొని ఆసుపత్రి గేటుకు తాళాలు వేసి వారిని బయటకు వెళ్లకుండా నిర్భందించారని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.