320
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముప్పాళ్ళ మరయదాసు (38) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో కాలుజరిపడిపోవడంతో మృతి చెందాడు. పశువులు కాయటానికి వెళ్లి కృష్ణానది దాటుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృత్యువాతపడ్డారు. స్థానికుల అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కంచికచర్ల పోలీసులు గాలింపు చర్యలు, ముమ్మరం చసి మృతదేహం వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.





Total views : 194755