Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Political ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ

ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ

by Satya
ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్ చర్చించనున్న ఏఐసీసీ

ఢిల్లీలో తెలంగాణ పాలిటిక్స్‌పై హాట్ హాట్‌గా రివ్యూలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా తన ఫ్యామిలీ మెంబర్లతో కలిశారు. తనకు పీసీసీ కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 30 నిమిషాలు పాటు తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. పీసీసీ నూతన కార్యకవర్గం, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై చర్చించినట్లు సమాచారం. దీంతో పాటు కుల గణన అంశాన్ని కూడా కేసీ వేణుగోపాల్ ఆరా తీసినట్లు తెలిసింది.
ప్రభుత్వం గత పది నెలలుగా చేపట్టిన 6 గ్యారంటీలు, రుణ మాఫీ, ఉద్యోగాల నియామకాలు, స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాట్లు, విదేశీ పెట్టుబడులు తదితర అంశాలను కేసీకి వివరించారు. పార్టీ యాక్టివిటీస్, నేతల పనితీరు‌పై కూడా చర్చించారు. ఇక జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌పై కూడా చర్చించినట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి రాసిన లేఖపై కూడా కేసీ అడిగి తెలుసుకున్నారు. పార్టీలో సమన్వయం, సమర్ధత వంటివి అవసరమని కేసీ మహేష్‌కుమార్ గౌడ్‌కు సూచించారు. నేతలందరితో కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాష్ట్ర పీసీసీ చీఫ్‌కు సూచించారు. పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత 50 రోజుల పాటు నిర్వహించిన పార్టీ ప్రోగ్రామ్స్‌పై కూడా కేసీ ఆరా తీశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రాసిన బుక్ ఆవిష్కరణకు పీసీసీ చీఫ్​హాజరు కానున్నారు. ఆ మీటింగ్ తర్వాత పలువురు ఏఐసీసీ అగ్రనేతలను మహేష్​కుమార్ గౌడ్ కలవనున్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి మహరాష్ట్రకు వెళ్లి పనిచేస్తున్న కార్యకర్తల గురించి హైకమాండ్ వివరించనున్నారు. మరోవైపు కొత్త పీసీసీ నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలి. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ తదితర నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలి. స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ నుంచి జిల్లా స్థాయి‌లో కమిటిలన్నీ కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం పార్టీ పవర్‌లో ఉంది. పార్టీ, ప్రభుత్వంతో సంపూర్ణమైన సమన్వయంతో పని చేసే వ్యక్తులనే ఎంపిక కేసీ పీసీసీ చీఫ్‌కు ఆదేశాలిచ్చారు.
త్వరలో తెలంగాణ‌లో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ‌కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నదని కేసీ వేణుగోపాల్ పీసీసీకి వివరించారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా అర్ధ రహిత, అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, దీన్ని వెంటనే అడ్డుకోవాలని మహేష్​ కుమార్ గౌడ్‌కు సూచించారు. సోషల్ మీడియా టీమ్‌లకు మరింత యాక్టివ్‌గా తయారు చేయాలన్నారు. అవసరమైతే బెంగళూరు‌లోని ఏఐసీసీ సోషల్ మీడియా టీమ్‌ల సహకారాన్ని తీసుకోవాలని కేసీ పీసీసీ‌కి సూచించారు. గాంధీ భవన్ వార్ రూమ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీ.. ఎన్నికల టాస్క్ తరహాలోనే పని చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.
    అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్‌ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
  • అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.
    అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
  • దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.
    భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
  • పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం.
    పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
  • ఇరాన్‍పై మరోసారి అమెరికా దాడులు.
    పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040952
Total views : 212509

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: