తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజురోజుకీ హై టెన్షన్ వాతావరణంలో ప్రచారాలు జరుగుతున్నాయి. తిరుపతిలో వైసిపికి, కూటమి అభ్యర్థి మధ్య రోజురోజుకీ వివాదం ముదురుతుంది. నిన్న జరిగిన ఘటనపై కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆరని శ్రీనివాసులు వ్యవహార శైలిపై టిటిడి చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుది హత్యా రాజకీయాల నేపథ్యం ఉన్న వ్యక్తి అని,.. ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలను కుంటే తస్మాత్ జాగ్రత్త ఆరణి శ్రీనివాసులు అంటూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి హెచ్చరించారు. ఇలాంటి రాజకీయాలను తిరుపతి ఎన్నటికీ అంగీకరించదని, ఇలా వ్యవహరించే వారిని తిరుపతి తుడిచి పెట్టేసింది అని అన్నారు. చిత్తూరులో హత్యారాజకీయ సంప్రదాయంలో పెరిగిన కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు అంటూ ఘాటుగా విమర్శించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ప్రశాంతతకు నిలయమైన తిరుపతి లో అలజడులు సృష్టించేందుకు, గూండాగిరితో చేయాలని చూస్తున్న వ్యక్తి శ్రీనివాసులు అని, ఈ వ్యక్తి తిరుపతి లో అల్లర్లు లేకుండా చేస్తాడంట.. పవిత్రతను కాపాడుతాడంట.. శ్రీనివాసులు ఇంకా చాలా చాలా సుద్ధులు మాట్లాడం ఆపు అంటూ హెచ్చరించారు. తిరుపతిలో ఎవరూ దొరక్కపోతే, చిత్తూరు నుంచి రెండు వేల మంది రౌడీలను తీసుకొచ్చి దాదాగిరి చేయాలని చూస్తున్నాడు. ఆరణి శ్రీనివాసులు పత్రికల ద్వారా సుద్ధులు చెప్పడం కాదు.. తిరుపతి ప్రజలు చాలా మంచి వారు కాబట్టి ఓటుతో నీకు తగిన బుద్ధి చెబుతారు అంటూ హెచ్చరించారు. నీ బతుకే, నీ నేపథ్యమే హత్యా రాజకీయాల నేపథ్యం…నువ్వేంది, కాపాడేదేంది…? చిత్తూరులో ఉన్న సంస్కృతిని తిరపతికి తెస్తూ, మా అరాచకాన్ని ఆపుతానంటావా..? మేము చేస్తున్న మంచిని తుడిచేయాలని, మేము చేసే సేవలు ప్రజలకు అందకుండా చేయాలననే హింసా నేపథ్యంతో ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతున్నాడు అన్నారు. టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తిరుపతిలో ఆదివారం ఉదయం ఎన్నికల ప్రచారం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…