అధ్యక్షులు వైస్సార్సీపీ సెంట్రల్ ఈ సందర్బంగా వెలంపల్లి శ్రీనివాస్ (Vellampalli Srinivas) మాట్లాడితూ డివిజన్ పర్యటనలో భాగంగా 28వ డివిజన్ పరిధిలో పర్యటించడం జరిగిందన్నారు. వైస్సార్సీపీ హయాంలో డివిజన్ అభివృద్ధి జరిగిందన్నారు. అందరికి అన్ని సంక్షేమ పధకాలు అందయాన్నారు. ప్రతి ఒక్కరు మంచిగా ఆదరిస్తున్నారన్నారు. ప్రతి డివిజన్లో మంచి మాకు ఆదరణ వస్తుందన్నారు. దాన్ని చూడలేక మా మీద దాడులు చేస్తున్నారన్నారు. పూటకో మాట మాట్లాడే వ్యక్తి బోండా ఉమా అని అన్నారు. బోండా ఉమా (Bonda uma) కి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. నిలకడ లేని వ్యక్తి బోండా ఉమా అని పేర్కొన్నారు. బాగా ఆవేశంలో ఉన్నాడు ఏది పడితే ఆడి మాట్లాడుతున్నాడన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మూలాలు అన్ని బొండా ఉమా కార్యాలయం చుట్టే తిరుగుతున్నాయన్నారు. అధికారులను బెదిరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పై అత్యాచారయతనం జరిగితే అధికారులు విచారణ జరపడం తప్ప అని ప్రశ్నించారు. ఎస్సీలను బీసీలను ఈ విధంగా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీలను బీసీలను చంద్రబాబు రౌడీలుగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఏనాడు ప్రజలకు మంచి చేయలేదు మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా అని ప్రజలు మాకు తెలియజేస్తున్నారన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కన్నుకు దెబ్బ తగిలి ఇబ్బంది పడుతుంటే నా మీద దుష్ప్రచారం చేయడం సబబు కాదన్నారు. కంటికి దెబ్బ తగిలిన నిత్యం నేను ప్రజల్లోనే ఉంటున్నాను అన్నారు. దాడికి పాల్పడిన వారు బోండా ఉమా తో ఎందుకు టచ్ లో ఉన్నారో ఉమా సమాధానం చెప్పాలని అన్నారు.సతీష్ తల్లిదండ్రులు బోండా ఉమా ఇంటికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు. .బోండా ఉమా అనే చేయించాడని దుర్గారావు చెప్తున్నాడన్నారు.ఇంతకంటే సాక్షాలు ఏమి కావాలన్నారు. నడిరోడ్డుపై ముఖ్యమంత్రి గారి పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడం తప్ప అని ప్రశ్నించారు.
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి