క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisements

<p>దేశాల భవిష్యత్‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌ వ్యవస్థ అత్యంత కీలకమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు&period; ఏప్రిల్‌ 14à°¨ &OpenCurlyQuote;క్వాంటం కంప్యూటింగ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌’ ప్రారంభోత్సవం అనంతరం&comma; ప్రపంచస్థాయి క్వాంటం వ్యవస్థ దిశగా మరో ముఖ్యమైన అడుగు పడిందన్నారు&period;దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటం వ్యాలీ ఆధ్వర్యంలో ఆవిష్కరణలు&comma; పరిశోధనలు కొనసాగుతున్నాయని సీఎం వెల్లడించారు&period; భారత ప్రభుత్వ టెలీకమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన సీ-డాట్‌ సంస్థ&comma; అమరావతి క్వాంటం వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే తొలి &OpenCurlyQuote;క్వాంటం-సెక్యూర్‌ కమ్యూనికేషన్స్‌ టెస్ట్‌ బెడ్‌’ ఏర్పాటు కానుందని చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>ఈ టెస్ట్‌ బెడ్‌ ద్వారా క్వాంటం కమ్యూనికేషన్‌ రంగంలో పరిశోధనలు&comma; పరీక్షలకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు&period; డిజిటల్‌ సదుపాయాల అభివృద్ధిపై తమ ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు&period; అమరావతిని డీప్‌-టెక్‌&comma; క్వాంటం ఆవిష్కరణల హబ్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు&period;అలాగే ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఏపీ విద్యార్థులు&comma; యువ పరిశోధకులకు ప్రపంచస్థాయి సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు లభిస్తాయని తెలిపారు&period; ఈ మేరకు సీఎం చంద్రబాబు ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..