Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News యాచకులపై కత్తులతో దాడులు

యాచకులపై కత్తులతో దాడులు

by Rama
murder

సికింద్రాబాద్.. తాజా.. ఉత్తర మండల పరిధిలో ఇద్దరు ఫుట్ పాత్ పై నివసించే యాచకులపై కత్తులతో దాడులు చేసారు. రెండు వేర్వేరు ఘటనలు జరగగా ఓ యాచకుడు దారుణ హత్య కు గురయ్యాడు. మరొక వ్యక్తికి తలకు, మెడ పై తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మోండా మార్కెట్ పి ఎస్ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఫుట్ పాత్ పై పడుకున్న వ్యక్తి పై ముగ్గురు గుర్తుతెలియని దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసారు. మెడను నరికి, తలపై భాగంలో కత్తులతో దుండగులు దాడి చేసారు. మారేడ్ పల్లి పి ఎస్ పరిధి గణేష్ ఆలయ సమీప ఫుట్ పాత్ పై పడుకొని ఉన్న మరో యాచకుడుపై అదే ముగ్గురు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ యాచకుడుని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అరగంట వ్యవధిలోనే ఇద్దరు యాచకులపై దాడి.. ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం .. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితుల ముఠా కోసం గాలింపు చర్యలు పోలీసులు చేపట్టారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: