Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చా గోష్టి….

రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చా గోష్టి….

by Prakash
Discussion forum on development issues of Rayalaseema....

తిరుపతిలో రాయలసీమ అభివృద్ధి సమస్యలపై చర్చాగోష్టి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సమావేశం. రాష్ట్ర విభజన హామీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని డా.ఎన్.తులసిరెడ్డి, ఏపీసీసీ మీడియా కమిటీ రాష్ట్ర ఛైర్మన్ అన్నారు. మౌళిక సదుపాయాలు, ముడిసరుకు ఉన్నా కడపకు స్టీల్ ప్లాంట్ నిర్మాణం అమలు కాదని తేల్చారు. మన్నవరం ప్రాజెక్టు ను మూసివేశారని, కడప – బెంగుళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ను యూపీఏ ప్రభుత్వం మొదలెట్టినా..వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో నిలిచిపోయిందని అన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ఏకంగా కడప – బెంగుళూరు రైల్వే లైన్ అవసరం లేదని కేంద్రానికి లేఖ రాశారని, వైఎస్సార్ సిఎంగా రైల్వే లైన్ క్లియర్ చేయిస్తే కుమారుడు జగన్మోహన్ రెడ్డి రద్దు చేయించారని అన్నారు. చంద్రబాబు సిఎంగా ఉండగా రాజధాని, హైకోర్టు రెండూ అమరావతిలో నిర్మించినా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారని, రాయలసీమకు హైకోర్టు తీసుకువచ్చే ప్రయత్నం చేయలేదని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతిని విశాఖకు తరలిస్తే నష్టపోయేది రాయలసీమ వాసులేనని, కృష్ణానది యాజమాన్యం బోర్డు విశాఖలో పెట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి యాజమాన్య బోర్డుకు లేఖ రాశారని, రాయలసీమలో కృష్ణానది బోర్డు ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నామని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే నష్టపోయేది సీమ వాసులేనని, సీమలో డ్రిప్ ఇరిగేషన్ అమలుకు డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014073
Total views : 78906

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.