తిరుమల ఆలయం పై జగన్ కన్ను ?

bhnau prakas reddy

Advertisements

&NewLine;<p>తిరుమల క్షేత్రాన్ని రాజకీయ పునరావాస క్రంద్రంగా మారుస్తున్నారని&comma; ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకు అంటూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండి పడ్డారు బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి&period; తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని&comma; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కన్ను తిరుమల శ్రీవారి ఆలయం పై పడిందని ఈ నేపథ్యంలోనే తిరుపతి అభివృద్ధిలో భాగంగా ఒక్క శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారు కానీ బిజెపి తీవ్రస్థాయిలో వ్యతిరేకించడంతో ప్రభుత్వం దానిని తిరస్కరించడంతో మరలా మొన్న జరిగిన పాలకమండలి సమావేశంలో కొత్తగా మరో ప్రతిపాదనను తీసుకొచ్చారని&comma; ఇందులో తిరుపతిలో దాదాపు 39 డివిజన్లో సానిటరీ వర్క్ చేయడానికి నిధులు మళ్ళిస్తున్నారని ఆరోపించారు&period;అలాగే తిరుపతిలో రోడ్ల అభివృద్ధి కంటూ 100 కోట్లకు పైగా నిధులను పక్కదారి మల్లిస్తున్నారని ఆరోపించారు&period; చట్టంలో ఎక్కడా లేనివిధంగా శ్రీవారి నిధులను ఇలా సానిటరీ వర్కులకు రోడ్ల అభివృద్ధి కంటూ దారి మళ్ళిస్తున్నారని రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తిరుపతి శాసనసభ్యులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆరోపించారు&period;తిరుపతి అభివృద్ధికి బిజేపి వ్యతిరేకం కాదని&comma;టీటీడీ నిధులు ఇలా పక్కదారి పట్టడానికి వ్యతిరేకిస్తున్నామని దీనిపై టీటీడీలో జరుగుతున్న అవక తవకలను కచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అక్కడ న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు&period;దేశంలో ఎక్కడ ఏ దేవాలయం నిదుల తో అభివృద్ధి జరగడం లేదని&comma;<br>ముఖ్యమంత్రి జగన్ ఇతర ఆర్గనైజేషన్ నుండి డబ్బులు తేగలరా అని ప్రశ్నించారు&period;తిరుపతి కి క్లీన్ సిటీ అవార్డ్లు వచ్చాయని ఇప్పుడు కొత్తగా టీటీడీ నిధులతో తిరుపతి రోడ్లను పారిశుద్ధ్య కార్మికుల నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదని కార్పొరేషన్ నిధులతోనే అవన్నీ సజావుగా జరుగుతున్నాయని గుర్తు చేశారు&period; తిరుమల శ్రీవారి దర్శనం సామాన్యులకే అధిక ప్రాధాన్యత కేటాయిస్తున్నామంటూ ప్రగల్పాలు పలికిన పాలకమండలి అధికారులు తమ ఎమ్మెల్యేలకు&comma;మంత్రులకు యదేచ్చగా ప్రోటాకాల్ టికెట్టు ఇచ్చి దర్శనాలు చేయించుకుంటున్నారని&comma; రాబోవు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తున్నారని ఆరోపించారు&period;ఈ బోర్డు వచ్చిన తరువాత ఎమ్మెల్యే లకు&comma;ఇతరులకు సుపదం ద్వార దర్శనాలు ఎదేచ్చా పంపు తున్నారని అన్నారు&period; రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని&comma; గత నెల రోజులలో ప్రోటోకాల్ దర్శనం సిసి ఫుటేజ్ విడుదల చేయగలరా అని సవాల్ విసిరారు భాను ప్రక్రష్&period; అధికారులు గానీ ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది గానీ ఎవరైనా సరే అఖిలాండడం వద్ద వచ్చి అవకతవకలు జరగడం లేదని ప్రమాణం చేయగలరా అని ప్రశ్నించారు&period;తిరుమల తిరుపతి దేవస్థానం ను జగన్ మోహన్ ఆలయం గా మార్చేసారని&comma;<br>ఆర్టిఐ పరిధిలోకి టిటిడి ని కూడా తీసుకురావాలి అని బిజేపి డిమాండ్ చేస్తుందని అన్నారు&period;ధార్మిక క్షేత్రం లో సవాళ్ళు ప్రతి సవాళ్లు మంచిది కాదని అధికారులు తమ తీరును మార్చుకోవాలని హెచ్చరించారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..