అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య…

Man commits suicide due to debt

Advertisements

&NewLine;<p>అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు&period; ఈ సంఘటన మదనపల్లిలో మంగళవారం జరిగింది&period; ఒకటవ పట్టణ పోలీసుల కథనం మేరకు స్థానిక కమ్మ వీధికి చెందిన దావూద్&lpar;38&rpar; పట్టణంలో చిరు వ్యాపారాలు చేస్తాడు&period; ఈ క్రమంలో కుటుంబ అవసరాలకు వడ్డీ వ్యాపారుల చెంత కొంత అప్పులు చేసి వాటిని తీర్చలేక పోయాడు&period; వడ్డీ వ్యాపారుల ఒత్తిడితో తీవ్ర మనస్తాపం చెందిన బాధితుడు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు&period; స్థానికులు గమనించి బాధితున్ని జిల్లా ఆసుపత్రికి తరలించగా&comma; ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు&period; మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు&period; ఘటనపై ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..