టెట్రా ప్యాక్‌లలోని వోడ్కాపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Advertisements

<p>టెట్రా ప్యాక్‌లు&comma; సాచెట్ల వంటి గుర్తించలేని ప్యాకేజీలలో మద్యం అమ్మకాలను నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రం స్పందనను కోరింది&period; ఇటువంటి ప్యాకేజింగ్ వినియోగదారులను తప్పుదోవ పట్టించి&comma; మైనర్ల మద్యపానాన్ని ప్రోత్సహించగలదని పిటిషన్‌దారు పేర్కొన్నారు&period; కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ అనే లాభాపేక్షలేని సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై&comma; భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్&comma; జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి&comma; పలు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు నోటీసులు జారీ చేసింది&period; సంస్థ తరఫున లాయర్ విపిన్ నాయర్ వాదనలు వినిపిస్తూ&comma; అలాంటి అనేక మద్యం ఉత్పత్తుల ప్యాకింగ్‌పై సరైన హెచ్చరికలు ఉండటం లేదని కోర్టుకు తెలిపారు&period; అవి పండ్ల రసాలను పోలి ఉండేలా ప్యాక్ చేస్తున్న సందర్బాలు ఉన్నట్లు తెలిపారు&period; అలాంటి ప్యాకేజీలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ అన్ని రాష్ట్రాలు&comma; కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒకే విధమైన విధానాన్ని రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు&period; సుప్రీంకోర్టు ఈ అభ్యర్థనను పరిశీలించి&&num;8230&semi;&period; ప్యాకింగ్ తప్పుదోవ పట్టించేలా ఉందంటూ కేంద్రం&comma; రాష్ట్రాల్లోని ఎక్సైజ్ విభాగాలకు నోటీసులు జారీ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..