ఒక వైపు అమరావతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చట్టబద్ధత లేదంటూ నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని కూల్చేసిన రోజునే విశాఖలోని పార్టీ ఆఫీస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాల కూల్చివేత పూర్తయిన వెంటనే విశాఖ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఎండాడ వద్ద వంద కోట్లకు పైగా ఖరీదైన రెండుఎకరాల స్థలాన్ని ఎకరానికి ఏడాదికి వెయ్యికి చొప్పున లీజుకు తీసుకుని భవనాన్ని కట్టేశారు. వంద కోట్లతో కట్టిన ఆ భవనానికి ఒక్కటంటే ఒక్క పర్మిషన్ తీసుకోలేదు. దీంతో నోటీసులు జారీ చేశారు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా పర్మిషన్లు తీసుకోకపోగా… ఏం చేస్తారో చేసుకోండన్నట్లుగా వ్యవహరించారు. ఏదో అనుమానం ఉన్నట్లు భావించి.. రాత్రికి రాత్రి పర్మిషన్ల కోసం దరఖాస్తులు చేశారు. కింది స్థాయి అధికారులతో అనుమతుల కోసం రెండు దశలు దాటించారు. ఆన్ లైన్ లాగిన్ లో ఇద్దరు అధికారులు ప్లాన్లు అప్రూవ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా కలెక్టర్ మల్లిఖార్జున ఆధ్వర్యంలో సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. విశాఖ ఆఫీసును కూడా కట్టేసిన తర్వాత లీగల్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం మారినా ఆయన తీరు మారలేదన్న నిర్మాణాలకు అనుమతుల్లేవా? ఆక్రమించి కట్టారా? ఆరోపణలు వస్తున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
- విష్ణు గొడవ చేయలేదు … మనోజ్ కావాలనే ఇదంతా చేస్తున్నాడుమంచు మనోజ్ ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదన్నారు తల్లి మంచు నిర్మల. మంచు మోహన్బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి