వైసీపీ(YCP)ని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కోససీమ జిల్లా మలికిపురం ఎన్నికల ప్రచారం(Election campaign) సభలో మాట్లాడుతూ.. రైతుల కష్టాలను నియోజకవర్గం ఎమ్మెల్యే ఏనాడు పట్టించుకోదని మండిపడ్డారు. డ్రైవర్ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని ఆ విషయాన్ని జనం అంత సులువుగా మరిచిపోరని అన్నారు. ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్సీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇదేక్కడి న్యాయం అంటూ ప్రశ్నించారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘ఆంధ్రా ప్రజలరా ఊపిరి తీసుకోండి. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని’ అని పవన్ అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోదరుడు రామకృష్ణ తమకు భారీ మొత్తంలో డబ్బులు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు ఇస్తామని హామీ ఇచ్చి…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90654