కరీంనగర్ ఎంపీగా విద్యావంతుడు… ప్రజల బాధలు…ప్రయివేట్ ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వ్యక్తి అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ (Boyinapalli Vinod Kumar) గెలిస్తేనే తమ బ్రతుకుల్లో చీకటి తొలిగి.. కొత్త వెలుగులు వస్తాయని… ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోదన్ననే ఎంపీగా గెలిపిస్తామని ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని ప్రయివేట్ విద్యాసంస్థల 40 వేల మంది ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మంగళవారం కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ట్రస్మా ముఖ్య సలహాదారుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విద్యా పన్ను కట్టడం జరుగుతుందని, ఇప్పటి వరకు 11 లక్షల వేల కోట్లు విద్యాపన్ను రూపంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేశాయని పేర్కొన్నారు. ఈ పన్ను ద్వారా వసూలు చేసిన డబ్బులు విద్యా వ్యవస్థకు ఖర్చు పెట్టాలని అన్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు 10లక్షల ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.చాలీచాలని వేతనాలతో ప్రయివేట్ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2018లో కరీంనగర్ ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు చట్టం కోసం పార్లమెంటు లో ప్రయివేట్ బిల్లుకు ప్రతిపాదన చేశారు.ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా హెల్త్ రీయింబర్స్ మెంట్ కల్పించాలని పేర్కొన్నారు. దేశంలోని 18 లక్షల మందికి ఎన్ఐ ఓఎస్ ద్వారా డీఎల్ఈడీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగౌడ్, రమేష్, రవిందర్ రెడ్డి, మధుసూదన్, రవి, రాజుయాదవ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- తెలంగాణకు కేంద్రం నుండి నిధులు కావాలితెలంగాణ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. యంగ్ ఇండియా పేరుతో రాష్ట్రంలో 100 ఇంటిగేట్రెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రాష్ట్రంలో ప్రారంభించబోతున్నామని దానికి 10వేల కోట్ల…
- రామకృష్ణ మఠం సేవలు ఎనలేనివి – గవర్నర్ జిష్ణు దేవ్ వర్మయువత వ్యక్తిత్వ వికాసానికి, శీల నిర్మాణానికి రామకృష్ణ మఠం అందిస్తున్న సేవలు ఎనలేనివని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొనియాడారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక జ్యోతి వెలిగించేందుకు, రామకృష్ణ మఠం దశాబ్దాలుగా చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి