Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana ఓల్డ్ సిటీ గుండానే ఎయిర్‌పోర్ట్ మెట్రో… రేవంత్ కీలక నిర్ణయం!

ఓల్డ్ సిటీ గుండానే ఎయిర్‌పోర్ట్ మెట్రో… రేవంత్ కీలక నిర్ణయం!

by Prakash
hyderabad metro train

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో రైలు కనెక్షన్ విషయంలో ముఖ్యమైన మలుపు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్లాన్ చేసిన ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపేశారు. పాత బాలాపూర్, ఫలక్‌నామా గుండా ఓల్డ్ సిటీ మీదుగా కొత్త మార్గం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజల ప్రయోజితమే ప్రధానం:

ఆలేరు-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మధ్య 31 కిలోమీటర్ల పొడవు, రూ. 6250 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రైలు వెళ్లనుంది. అయితే, ఈ మార్గం ప్రజలకు ఎంతో ఉపయోగం కలిగించదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం చేకూరుస్తుందని రేవంత్ భావించారు. అందుకే ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గం పరిశీలించాలని నిర్ణయించారు.

ఓల్డ్ సిటీకి కనెక్షన్:

పాత నగర ప్రజలకు ఎయిర్‌పోర్ట్‌కు సులువైన కనెక్షన్ కల్పించే దిశగా కొత్త మార్గం ప్రతిపాదన ఉంది. ఎల్బీ నగర్, ఫలక్‌నామా నుంచి చంద్రాయణగూట, ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్‌పోర్ట్‌కు రైలు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఓల్డ్ సిటీలోని లక్షలాది మంది ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. అదే కాకుండా, ఐటీ కారిడార్ ప్రాంతంలో కూడా స్టేషన్లు ఏర్పాటు చేస్తే మెరుగుపడుతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.

పరిశీలన అనంతరం నిర్ణయం:

కొత్త మార్గం పరిశీలన జరుగుతుంది. ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్ పరిస్థితులు, ఖర్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్గం ఖరారు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్ మెట్రో విషయంలో సమగ్ర పరిశీలన జరిగి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే రైలు మార్గం ఏర్పాటు కావాలని హైదరాబాద్ వాసులు ఆశిస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

013953
Total views : 78665

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.