అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైసీపీ నాయకుల విభేదాలు రోడ్డు కెక్కాయి. సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. చెప్పులతో కొట్టుకునే వరకు వచ్చిన వ్యవహారం. ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్వెల్ నాగిరెడ్డిపై చెప్పులతో దాడి చేసిన సంఘటన రాయదుర్గం పట్టణంలో కనేకల్ రోడ్డు లోని రుచిస్ హోటల్ ముందర చోటుచేసుకుంది. కనేకల్ రోడ్డులోని రుచిస్ హోటల్ వద్ద ఉన్న బోర్వెల్ నాగిరెడ్డి పై రామచంద్రారెడ్డి వదిన మంజుల ఒక్కసారిగా చెప్పుతో దాడి చేసింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి వరుసకు సోదరుడు అయిన హంపారెడ్డి పై బోర్వెల్ నాగిరెడ్డి వాట్సాప్ లో వ్యక్తిగత దూషణలు చేసాడు. వైసీపీ నాయకుడు మెట్టు గోవిందరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారంటూ హంపారెడ్డి పై బోర్వెల్ నాగిరెడ్డి వ్యక్తిగత దూషణ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు బోర్వెల్ నాగిరెడ్డి పై హంపారెడ్డి భార్య మంజుల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
cvr news chanel
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో వైసీపీ నేతల బరితెగింపు, అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు ఆక్రమిస్తున్న వైసీపీ నాయకులు. చర్చి భూమిని కాజేసేందుకు యత్నం అడ్డుపడ్డ సంఘస్తుల పై దాడి. రెండు కోట్ల విలువ చేసే భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వైసిపి నాయకులు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం ఇరికేపల్లి లూధరన్ చర్చి కి సంబంధించిన 2 ఎకరాల70 సెంట్ల భూమి ని వైసీపీ నేత దాచేపల్లి నగర పంచాయతీ కో ఆప్షన్ మెంబర్ అంజమ్మ భర్త వేల్పుల ధర్మదేవ్, అతని అన్న కొడుకు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి వేల్పుల కిషోర్ కబ్జా చేసేందుకు ప్రయత్నం చేసారు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థలం లోకి jcb తో అక్రమించగా చర్చి సంఘ పెద్దల ఇదేమిటి ఇది బ్రిటీష్ వారు మా చర్చికి ఇచ్చారు ఇది మా సంఘం కి సంబంధించిన స్థలం మీరెవరూ అని ప్రస్నించగా ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి కిషోర్ సంఘ పెద్దల పై దాడి చేసి బలంగా కడుపులో పిడికిలితో గుద్దడంతో సంఘ పెద్దలు అందరూ కలసి దాచేపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసేందుకు వెళ్లారు కాని పోలీసులు కూడా మీరు ఎందుకు వెళ్లారు మీకు ఏమి సంబందం అని వైసీపీ నేతలకు వత్తాసు పలికారు సదరు విషయం పై సోమవారం జిల్లా కలెక్టర్ కి,యస్పీ కి స్పందనాలో పిర్యాదు చేయాలని సంఘస్తులు నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో రైలు కనెక్షన్ విషయంలో ముఖ్యమైన మలుపు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్లాన్ చేసిన ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిపేశారు. పాత బాలాపూర్, ఫలక్నామా గుండా ఓల్డ్ సిటీ మీదుగా కొత్త మార్గం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల ప్రయోజితమే ప్రధానం:
ఆలేరు-రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్య 31 కిలోమీటర్ల పొడవు, రూ. 6250 కోట్ల అంచనా వ్యయంతో ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చింది. దీని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా రైలు వెళ్లనుంది. అయితే, ఈ మార్గం ప్రజలకు ఎంతో ఉపయోగం కలిగించదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రమే లాభం చేకూరుస్తుందని రేవంత్ భావించారు. అందుకే ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గం పరిశీలించాలని నిర్ణయించారు.
ఓల్డ్ సిటీకి కనెక్షన్:
పాత నగర ప్రజలకు ఎయిర్పోర్ట్కు సులువైన కనెక్షన్ కల్పించే దిశగా కొత్త మార్గం ప్రతిపాదన ఉంది. ఎల్బీ నగర్, ఫలక్నామా నుంచి చంద్రాయణగూట, ఓల్డ్ సిటీ మీదుగా ఎయిర్పోర్ట్కు రైలు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఓల్డ్ సిటీలోని లక్షలాది మంది ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. అదే కాకుండా, ఐటీ కారిడార్ ప్రాంతంలో కూడా స్టేషన్లు ఏర్పాటు చేస్తే మెరుగుపడుతుందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు.
పరిశీలన అనంతరం నిర్ణయం:
కొత్త మార్గం పరిశీలన జరుగుతుంది. ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్ పరిస్థితులు, ఖర్చు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త మార్గం ఖరారు చేయనున్నారు. ఎయిర్పోర్ట్ మెట్రో విషయంలో సమగ్ర పరిశీలన జరిగి ప్రజలకు ఉపయోగకరంగా ఉండే రైలు మార్గం ఏర్పాటు కావాలని హైదరాబాద్ వాసులు ఆశిస్తున్నారు.




Total views : 78385