26
మహారాష్ట్రలోని పుణెలో ఓ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది. సోలాపూర్కు చెందిన శివాజీ రాథోడ్ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో ఈ డ్రామాకు తెరలేపాడు. హడప్సర్లోని కామధేను ఎస్టేట్ ప్రాంతంలోని ఆసుపత్రి మరుగుదొడ్డిలో డిజిటల్ క్లాక్, పైపులు, వైర్లతో బాంబులా కనిపించే వస్తువును ఉంచి బెదిరింపులకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా గాలింపు చేపట్టగా… టేపు కొనుగోలుకు చేసిన డిజిటల్ చెల్లింపు ఆధారంగా నిందితుడిని నాగ్పూర్ రైల్వే స్టేషన్లో అరెస్టు చేశారు. నేపాల్కు పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.





Total views : 78502