Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra PradeshVishakapattanam తహసీల్దార్‌ హత్య కేసులో నిందితుడు అరెస్టు

తహసీల్దార్‌ హత్య కేసులో నిందితుడు అరెస్టు

by Rama
MRO Ramanaih

విశాఖ జిల్లాలో దారుణ హత్యకు గురైన తహసీల్దార్‌ రమణయ్య హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావును చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ రవిశంకర్‌ వెల్లడించారు. ఏసీపీ త్రినాథ్‌ నేతృత్వంలో చెన్నై వెళ్లిన బృందం.. గంగారావును అదుపులోకి తీసుకొని రాష్ట్రానికి తీసుకొచ్చింది. సీపీ రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్థిరాస్తి లావాదేవీలే హత్యకు కారణం. నిందితుడి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశాం. హత్య చేసిన తర్వాత నిందితుడు విమానంలో విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాడు. తర్వాత చెంగల్‌పట్టు నుంచి చెన్నై వెళ్తుంటే పట్టుకొని విశాఖ తీసుకొచ్చాం. గంగారావు ఓ స్థిరాస్తి సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడిపై హైదరాబాద్‌, విజయవాడలో చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. దాదాపు రూ.5 కోట్ల వరకు నష్టపోయినట్లు తెలుస్తోంది అని సీపీ వివరించారు. విశాఖ రెవెన్యూ అసోసియేషన్‌ వినతిపత్రం ఇచ్చిందని.. రెవెన్యూ ఉద్యోగుల భద్రతపై కలెక్టర్‌తో చర్చించామని తెలిపారు. Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: