Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. పొత్తు లో కీలక పరిణామం

అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. పొత్తు లో కీలక పరిణామం

by Satya
TDP and BJP

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసకుంటున్నాయి. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పొత్తు విషయంలో జరిగిన చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 అసెంబ్లీ స్థానాలపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబుతో చర్చలు జరిపిన అమిత్ షా, బీజేపీకి పట్టున్న అసెంబ్లీ స్థానాల వివరాల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానాన్ని ఆదేశించారు. ఈ మేరకు సీట్లపై కసరత్తు చేసి రాష్ట్ర బీజేపీ అధినాయత్వం 20 అసెంబ్లీ స్థానాలతో ఓ జాబితాను రూపొందించింది. ఉమ్మడి కర్నూలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి చూపుతోంది. తూర్పు గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 1, పశ్చిమ గోదావరిలో 3 సీట్లను ఆ పార్టీ కొరుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ.. హైకమాండ్‌కు ఏపీ బీజేపీ రిపోర్టును పంపింది.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.
    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
  • ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
    ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: