Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh అమిత్ షా కు వేల్పూరి శ్రీనివాసరావు లేఖ…

అమిత్ షా కు వేల్పూరి శ్రీనివాసరావు లేఖ…

by Prakash
pavan kalyan

పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు లేఖ.

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మారణాయుధాలు తొ దాడి చేయడం హేయమైన చర్య అని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ నాయకులు దాడికి కుట్ర చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం జగన్ చేస్తున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ప్రాణాలు కు తక్షణం కేంద్ర బలగాలు తో రక్షణ కల్పించాలని శ్రీనివాసరావు లేఖలో కోరారు. జగన్ కుటుంబం కు 53 సంవత్సరాల నుంచి నేర చరిత్ర ఉన్నది అని, 33 కేసు లలో ముద్దాయి గా జగన్ ఉన్నారని, దేశంలో అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ పార్టీ జగన్ పార్టీ అని శ్రీనివాసరావు గుర్తు చేశారు.

జగన్ ప్రభుత్వం తో సామాన్యులు నుండి ఎన్నికల కమిషనర్ వరకు రక్షణ లేదనీ తెలిపారు. జగన్ ప్రభుత్వం లో అనేక మంది ప్రజా ప్రతినిధులు మీద దాడులు జరిగిన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. జగన్ కు ప్రధాన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అన్న విషయం బహిరంగ రహస్యం అని లేఖలో పేర్కొన్నారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్టు కాకుండా సిఎం పదవిని అడ్డు పెట్టుకొని సిబిఐ మీదనే తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర జగన్ నేర స్వభావాన్ని తెలియ చేస్తున్నది అని పేర్కొన్నారు. తాలిబన్లు అరాచక పాలన లో పవన్ కళ్యాణ్ కు వెంటనే రక్షణ ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, పవన్ కు ఏ మాత్రం హాని జరిగినా రాష్ట్రం వల్లకాడు గా మారుతుంది అని చెప్పారు.

Advertisements

You may also like

Our Visitor

019165
Total views : 90047

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.