కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం చెలరేగింది. ఎమ్మెల్యేపై బండే శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేస్తూ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు, అల్లుడి అండతో నియోజకవర్గంలో ఇసుక, బుసక అక్రమ తవ్వకాలు, మద్యం అధిక ధరలు, మరియు రేషన్ బియ్యం దందా సాగిస్తున్నారని విమర్శించారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిరూపిస్తా, బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ ఎమ్మెల్యేకు నేరుగా సవాల్ విసిరారు. ఒకే కూటమిలో ఉండి నేతలు ఇలా బాహాబాహీకి దిగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
Pavan kalyan
సీఎం జగన్ (CM Jagan) :
ఎన్నికలకు సమయం దగ్గర పడిందని, పేదల వ్యతిరేకులను ఓడించాలని సీఎం జగన్ (CM Jagan) పిలుపునిచ్చారు. కాకినాడ అచ్చంపేట జంక్షన్లో ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్ ప్రసంగించారు. పెత్తందారులకు చంద్రబాబు, పవన్ అనుకూలమని, తాము మాత్రం పేదల కోసమే ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పుడు పెత్తందారుల అనుకూల వర్గానికి, పేదల అనుకూల వర్గానికి మధ్య క్లాస్ వార్ జరుగుతోందన్నారు. తాము గెలిస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చెప్పారు. పొరపాటున కూడా చంద్రబాబుకు ఓటు వేయొద్దని ప్రజలకు సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుందని, పశుపతి నిద్రలేచి వదల బొమ్మాళి అంటారని ఎద్దేవా చేశారు. ప్రజలు వేసే రెండు ఓట్లు కూడా వైసీపీ అభ్యర్థులకే వేయాలని సీఎం కోరారు. ఫ్యాన్కు ఓటేస్తే అవ్వాతాతలకు ఇంటి వద్దే 3 వేలు పింఛన్ అందుతుందని తెలిపారు. చంద్రబాబుకు ఓటు వేస్తే జన్మభూమి కమిటీలు మళ్లీ దోచుకుంటాయన్నారు. వైసీపీకి ఓటు వేస్తే లంచాలు, వివక్షత లేని పారిపాలన అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల…
- కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని ఎస్పీ కాలనీలో రహదారి శంకుస్థాపన సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం…
- తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలుతిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్న డి మార్ట్ స్టోర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ కౌన్సిల్ సభ్యుడు మించల ప్రదీప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు…
సోషల్ మీడియా (Social Media) :
జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా (Social Media)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఓ ఆంగ్ల దినపత్రికను చూస్తున్నప్పటి ఫొటో పంచుకున్నారు. ఆ పేపర్లో మోదీ స్పీచ్ తాలూకు బ్యానర్ ఐటమ్ ఉంది. ‘ఇది మోదీ హామీ… అవినీతికి పాల్పడిన వారు జైలుకే’ అన్నది ఆ పేపర్లోని కథనం శీర్షిక. దీనిపై పవన్ స్పందిస్తూ… “విజయవాడ ఎయిర్ పోర్టులో విమానం కోసం వేచిచూస్తుండగా ప్రత్యేకించి ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ గౌరవనీయ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఇది చదవండి : జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి!- వైఎస్ షర్మిలా రెడ్డి
ప్రియమైన వైసీపీ… ఇది మీ సీఎంకు కూడా వర్తిస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే… అది ఎన్నికలకు ముందు జరుగుతుందా, లేక ఎన్నికలు అయిపోయాక జరుగుతుందా? వైసీపీ సర్కారును సాగనంపి, బీజేపీ-టీడీపీ-జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు” అంటూ పవన్ ట్వీట్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జనసేనాని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..
రఘురామకృష్ణరాజు (RRR) :
టీడీపీ నేత, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు (RRR) పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ… అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఇక… పవన్ కల్యాణ్, నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడ్నించి పోటీ చేసినా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, జగన్ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో పవన్ కు 65 వేల ఓట్ల మెజారిటీ ఖాయమని రఘురామ ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తమ్ముడు పవన్ పార్టీకి అన్న చిరంజీవి వితరణ చర్చనీయాంశంగా మారింది. అయిదు కోట్ల రూపాయల చెక్కు పార్టీ ఫండుగా అన్న చిరంజీవి పవన్ కు ఆంజనేయస్వామి సాక్షిగా అందించారు. అంతే కాదు ఇప్పటి వరకు పవన్ పార్టీ జనసేనకు కనీసం మద్దతు ప్రకటిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి ఎక్కడా వెల్లడించలేదు. పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ మాత్రమే తంటాలు పడుతూ వచ్చారు. దీన్నిబట్టి చిరంజీవి సహా మెగా కుటుంబం జనసేనకు దూరమని అంతా భావించారు. కానీ తాజా పరిణామం ఆసక్తికర ఆలోచనలకు ఊతంగా నిలుస్తోంది. జనసేన కోసం చిరంజీవి ఈ భారీ వితరణ ప్రకటించడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా వున్నారు. కూటమి తరపున ప్రచారం చేయక పోయినా తమ్ముడు పవన్ కోసం చిరంజీవి పిఠాపురంలో అడుగు పెడతారని గంపెడాశతో వున్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో జనసేన పార్టీ నేత యల్లటూరి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో తోట కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుండుపల్లి, వీరపల్లి, ఒంటిమిట్ట, సిద్దవట్టం, రాజంపేట, నందలూరు మండలాల నుంచి పెద్దఎత్తున జనసేన శ్రేణులు పాల్గొన్నారు. ఈ సభలో కార్యకర్తల బహిరంగ అభిప్రాయాల సేకరణ నిర్వహించారు. వారు యల్లటూరి శ్రీనివాసరాజు తెలుగుదేశం వెంట నడవాలని, భారీ మెజారిటీతో గెలిపించు కోవాలని సూచించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట అభివృద్ధికి జనసేన, టీడీపీ కలిసి కృషి చేస్తాయని హామీ ఇచ్చారు. జనసేన టిక్కెట్ రాలేదని తిరుగుబాటు చేయకుండా, సంస్కారవంతంగా సహకరించిన విద్యావంతుడు యల్లటూరి శ్రీనివాసరాజును సుగవాసి కొనియాడారు.
పవన్ కళ్యాణ్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పూరి శ్రీనివాసరావు లేఖ.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మారణాయుధాలు తొ దాడి చేయడం హేయమైన చర్య అని, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ మీద అధికార పార్టీ నాయకులు దాడికి కుట్ర చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం జగన్ చేస్తున్న అవినీతి, అక్రమాలపై నిరంతరం పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కు ప్రాణాలు కు తక్షణం కేంద్ర బలగాలు తో రక్షణ కల్పించాలని శ్రీనివాసరావు లేఖలో కోరారు. జగన్ కుటుంబం కు 53 సంవత్సరాల నుంచి నేర చరిత్ర ఉన్నది అని, 33 కేసు లలో ముద్దాయి గా జగన్ ఉన్నారని, దేశంలో అత్యంత క్రిమినల్ కేసులు ఉన్న రాజకీయ పార్టీ జగన్ పార్టీ అని శ్రీనివాసరావు గుర్తు చేశారు.
జగన్ ప్రభుత్వం తో సామాన్యులు నుండి ఎన్నికల కమిషనర్ వరకు రక్షణ లేదనీ తెలిపారు. జగన్ ప్రభుత్వం లో అనేక మంది ప్రజా ప్రతినిధులు మీద దాడులు జరిగిన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. జగన్ కు ప్రధాన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ అన్న విషయం బహిరంగ రహస్యం అని లేఖలో పేర్కొన్నారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్టు కాకుండా సిఎం పదవిని అడ్డు పెట్టుకొని సిబిఐ మీదనే తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర జగన్ నేర స్వభావాన్ని తెలియ చేస్తున్నది అని పేర్కొన్నారు. తాలిబన్లు అరాచక పాలన లో పవన్ కళ్యాణ్ కు వెంటనే రక్షణ ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు. కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, పవన్ కు ఏ మాత్రం హాని జరిగినా రాష్ట్రం వల్లకాడు గా మారుతుంది అని చెప్పారు.
తిరుపతి (Tirupati)లో లోకల్, నాన్ లోకల్ వార్..
ఆరని శ్రీనివాసులని అంగీకరించలేకపోతున్న తిరుపతి టిడిపి, జనసేన కేడర్…
అభ్యర్థిని మార్చకపోతే ఓటమి తప్పదంటూ సంకేతాలు…
తెలుగుదేశం, జనసేన, బిజెపి అధిష్టానం నిర్ణయం పై… ఆయా పార్టీ నేతల అసంతృప్తి.
చిత్తూరులో వైసీపీలో ఉండి జనసేనలకు వచ్చిన ఆరణి శ్రీనివాస్ తిరుపతి నుంచి పోటీ చేస్తామంటే సహకరించబోమంటున్నా టిడిపి, జనసేన నాయకులు.
భూమన కుటుంబాన్ని ఢీ కొనడం అంత ఈజీ కాదు అంటున్న రాజకీయ పండితులు…
ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని టిడిపి, జనసేన నాయకుల ఆలోచన.
రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన అనుకూల పవనాలు వీస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానిక పరిస్థితులను అనుసరించి వారి అభిప్రాయాలకూ అణుగుణంగా గెలుపు గురాళ్లకే టికెట్టు ఇవ్వాల్సిన జనసేన, టిడిపి పార్టీలు తిరుపతిలో మాత్రం మొదటిలోనే తప్పటడుగు వేసింది. రాష్ట్రమంతా ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటమి విజయం ఖచ్చితంగా సాధిస్తుందని దీనికి తోడు బిజెపి కూడా కలిసి రావడంతో టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థులు గెలవడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అభ్యర్థుల ఎంపిక అనేది పార్టీల అధినేతలకు కత్తి మీద సాము లాంటిదే. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ప్రధానంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి వారికి అనుకూలంగా ఉన్న నేతలను బరిలోకి దించాల్సి ఉంటుంది. ఇందులో ఆర్థిక బలం, అంగ బలం, ప్రజా అభిమానం, పార్టీపై సానుకూలత, స్థానికత అనే అంశాలను పరిగణలోకి తీసుకొని ఆయా పార్టీ నేతలు బి ఫామ్ లు ఇస్తారు. అయితే తిరుపతిలో మాత్రం అందుకు రివర్స్ లో అభ్యర్థుల ఎంపిక జరిగిందని తిరుపతి వాసులు అంటున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో తిరుమల శ్రీవారి పాదాల చెంత విజయం సాధించిన అభ్యర్థి సెంటిమెంట్ గానే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడతారని నమ్మకం కూడా బలంగా ఉంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుండి మహామహులు పోటీకి దిగి విజయం సాధించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించినవారే. అందులో ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు ఉండడం గమనార్హం. ఇంతటి కీలకమైన స్థానంలో ఇప్పుడు విజయం ఏ పార్టీలకైనా అత్యంత కీలకం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
తెలుగుదేశం, బిజెపి, జనసేన కలిసి కూటమిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించిన నేపథ్యంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థి ఎంపిక విషయంలో పూర్తిగా సరైన అంచనాకు రావడంలేదనే విషయం పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. చిత్తూరు అసెంబ్లీ స్థానానికి తనకు టికెట్టు ఇవ్వలేదని ఆవేదనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలి జనసేనలో చేరిన ఆరని శ్రీనివాసులు కు తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ప్రకటించడం తిరుపతి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించడమే కాకుండా పార్టీ వర్గాలను సైతం ఆవేదనకు గురిచేస్తుంది. నిన్నటి వరకు వైసిపి లో ఎమ్మెల్యేగా ఉన్న ఆరని శ్రీనివాసులను చిత్తూరు నుండి తిరుపతికి తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం పై స్థానికులు ఒప్పుకున్నా టిడిపి జనసేన లోని నాయకులు మాత్రం ససేమిరా అంటున్నారు.
అసలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం లో 2019 లో జరిగిన ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి అత్యంత స్వల్పంగా 700 పైచిలుకు ఓట్లతో గెలిచారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు భూమన అభినయ రెడ్డిని తెరపైకి తెచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా భూమన అభినయ్ తిరుపతి అభివృద్ధిలో తన మార్కును చాటుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా లేని అభివృద్ధిని ఏడాది కాలంలోనే చేసి చూపించారు. మౌలిక వసతులు కల్పిస్తే కచ్చితంగా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భావనతో భూమన అభినయ రెడ్డి తిరుపతిలో కనువిని ఎరుగనిరుగని రీతిలో మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్లను అభివృద్ధి చేశారు. రాష్ట్రమంతటా వైసిపి వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ తిరుపతిలో మాత్రం వైసీపీని, భూమన కుటుంబాన్ని ఓడించడం అంత ఈజీ కాదని రాజకీయ పండితులు అంటున్నారు. తిరుపతిలో దాదాపు నాలుగు లక్షలకు పైగా ఉన్న ఓటర్లు లో 60 శాతం మందికి పైగా బలిజ కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఉండడం కారణంగా ఇక్కడి అభ్యర్థి గెలుపులో వారి ఓట్లే కీలకంగా పనిచేస్తాయి.తెలుగుదేశం పార్టీలో ఆశావహులైన మాజీ టిడిపి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఊకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్, నరసింహ యాదవ్ తదితరులు ఎదురు చూశారు. అదేవిధంగా జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ లాంటి నాయకులు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థులుగా పోటీపడ్డారు.
తిరుపతి పరిస్థితులు చంద్రబాబు నాయుడు బాగా తెలిసినప్పటికీ పొత్తులో భాగంగా సీటును జనసేనకు కేటాయించారు. దీంతో ఇంతకాలం తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీగా అవతరించిన నాటి నుండి తిరుపతిలో ఆ జెండా తోనే ఎన్నికల్లో నిలబడిన పరిస్థితులను పక్కనపెట్టి ఇప్పుడు తొలిసారిగా జనసేన జెండా ఎగిరేలా పరిస్థితి చూడాల్సి వచ్చింది. వైసిపి ఎమ్మెల్యే అయిన ఆరని శ్రీనివాసులు చిత్తూరు లో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్కడ గెలవడని వైసీపీ అధిష్టానం ఆరణికి టికెట్టు కేటాయించ లేదు. దీంతో ఆరణి జనసేన కండువా కప్పుకున్నారు. జనసేనలో తీసుకున్న వెంటనే స్థానికేతరుడు అని కూడా చూడకుండా తిరుపతి జనసేన అభ్యర్థిగా ప్రకటించడం జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ నిలబడితే కచ్చితంగా విజయాన్ని సాధించ వచ్చు అనే అభిప్రాయం ఉంది.
అలాకాకుండా జనసేనలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరు నిలబడినా గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవు. కాదు అంటే తెలుగుదేశం పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన లోకి వెళ్లితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకుల భావన. ఒక విధంగా చెప్పాలి అంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ పనిచేస్తోంది. జనసేనకు ఉన్న పార్టీ క్యాడర్ కూడా అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నాన్ లోకల్ గా చిత్తూరు లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరని శ్రీనివాసులు తప్పించి నిలబడితే పవన్ కళ్యాణ్ నిలబడాలి.. లేదా ఆర్థికంగా,సామాజికంగ సుగుణమ్మ భలమైన అభ్యర్థి కనుక జనసేనలోకి ఆహ్వానించి ఆమెకే అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే గెలుపుకు డోకా ఉండదని పార్టీ వర్గాలు ఇటు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరని శ్రీనివాస్ కు ప్రచారం చేసుకోమన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన తిరుపతిలో స్థానిక ఆలయాల దర్శనాలతో పాటు ప్రచారాన్ని కూడా ప్రారంభించేసారు. మరోవైపు టిడిపి జనసేన లోని కొంతమంది నాయకులు కార్యకర్తలు ఆరణి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా గ్రూపులు కట్టారు. మంగళవారం తిరుపతి లో జరిగిన పరిణామాల తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో టిడిపి జనసేన కి సంబంధించి ఏ వ్యక్తినైనా ఇండిపెండెంట్గా అయిన నిలబెట్టి కచ్చితంగా గెలిచి తీరుతామని ఆలోచనలో టిడిపి, జనసేన నాయకులు ఉన్నట్టు సమాచారం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి
“ఎన్డీఏ ప్రజాగర్జన సభ ఘన విజయం – జగన్ గారి శిబిరానికి ఎన్నికలలో ఓటమి భయం”
పది లక్షల మంది ప్రజల స్వచ్ఛంద సహకారంతో నిన్న బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగర్జనతో జగన్ గారు తట్ట బుట్ట సద్దె పనిలో నిమగ్నమయ్యారు. జగన్ గారి నాలుగు సిద్దం సభలు అధికార మరియు ప్రజాధన దుర్వినియోగంతో జరిగితే ఎన్డీఏ మొదటి ప్రజాగర్జన సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రధాని మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక మీద కనపడగానే 2014 లో ఎన్డీఏ కి వరించిన విజయం మించిన విజయం 2024లో తథ్యం అనే భయాందోళనలో జగన్ గారి శిబిరం పడింది. రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులు ఏకం కావాలని రాష్ట్రంలో ప్రజల కోరిక. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను అవినీతి, అరాచక పాలన నుండి రక్షించుకొని సమ్మిళిత అభివృద్ధి దిశగా ఎన్డీఏ పాలనలో అడుగులు పడాలని ప్రజల ఆకాంక్ష.
మోడీ గారు సంకల్పించిన వికసిత భారత్ లో భాగం వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యం. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత జగన్ గారి ట్రబుల్ ఇంజన్ సర్కార్ పోయి దేశంలోఅభివృద్ధి సంక్షేమానికి చిరునామా అయిన డబుల్ ఇంజన్ సర్కార్ అనివార్యం. రాష్ట్రానికి ఇప్పుడున్న అవినీతి, అరాచక, విధ్వంసక పాలన ప్రమాదం నుండి కాపాడుకోవడం మాత్రమే త్రిమూర్తుల వంటి ఈ మూడు పార్టీల కింకర్తవ్యం. 2018 లో జరిగిన పొరపాటు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క చుక్క విషం అని ప్రజలు గమనించలేక పోయారు, ఇప్పుడు రాష్ట్రానికి అమృతం అవసరం. రాష్ట్రంలో ప్రజలకు 2019లో మధ్య నిషేధం , రైతుల ధరల స్థిరీకరణ నిధి, యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి అన్న జగన్ గారు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జగన్ గారి పాలనలో మద్యం మాఫియాతో, ల్యాండ్, సాండ్, మైన్ మాఫియా పెట్రేగి పొయ్యరు. రాష్ట్రంలో వనరుల దోపిడీ తప్ప ప్రజలకు ఆరోగ్య వంతమైన వసతులు ఏమీ కల్పించారో చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు వైకాపా బరితెగిస్తుంది. రైతులకు భీమా ప్రీమియం చెల్లించకుండా జగన్ గారి ప్రభుత్వం అన్యాయo చేసింది. 2019 అనంతరం పారిశ్రామికవేత్తలను భయకంపితులను చేయడంతో రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడంతో యువతకు ఉద్యోగ మరియు ఉపాధి లేకుండా జగన్ గారి పాలన సాగింది. అమరావతిలో జగన్ గారు నిర్వీర్యం చేసిన అభివృద్ధి మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో ఏర్పాటు తథ్యం.
ఉత్తరాంధ్ర రాష్ట్ర అర్థిక రాజధానిగా, రాయలసీమ ఎలెక్ట్రానిక్ మరియు ఆటోమొబైల్ తయారు రంగ రాజధానిగా రాబోయే ఎన్డీఎ డబుల్ ఇంజన్ సర్కార్ రూపుదిద్దుతుంది. వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన 52 ఎకరాల భూమిని రాష్ట్రంలో పాలన సాగిస్తున్న జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల వాటి నిర్మాణానికి అంతరాయం కలిగింది. కర్నూల్ హై కోర్టు అంశంలో జగన్ గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రబుత్వం సుప్రీం కోర్ట్ లో వేసిన అఫిడవిట్ ని చదివే దమ్ము జగన్ గారికి ఉందా. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పైన జగన్ గారి కన్ను పడిందా లేదా అయినే చెప్పాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను మోడీ గారీ ప్రభుత్వం లేకుంటే తల్లి పిల్ల కాంగ్రెస్ నాయకులు పంచుకునేవారు.
ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను లాగేసుకోవాలని మీరు వేసిన ప్రణాళికకు సాధ్యం కాదన్న నాటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గారుని వేధించారా లేదా. కేంద్రంలో ప్రభుత్వ రంగ ఆస్తుల విలువ 2014లో 9 లక్షల కోట్లు మాత్రమే కాకుండా, నష్టాలతో నడుస్తూ ఉంటే నేడు మోడీ గారు ప్రధాని అయ్యాక నేడు లాభాల బాటలో నడుస్తూ వాటి నికర ఆస్తుల విలువ దాదాపు 20 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రధాని మోడీ గారు హెడ్ లైన్ లో పేరు పడడం కోసం కాకుండా డెడ్ లైన్ లోపు అభివృద్ధి సంక్షేమం కోసం పని చేస్తారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సమాచారం ఇవ్వకుండా జగన్ గారు తమ మిత్రులకు కట్టబెట్టేందుకు మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేసింది నిజమా కాదా?
దుగ్గరాజు పట్టణం పోర్ట్ నిర్మాణం సాధ్యం కాదని తెలిసినా విభజన చట్టంలో పెట్టినప్పుడు ఎంపీ గా ఉన్నా జగన్ గారు ఏమి చేశారు. నిన్న కాక మొన్న 10 వేల కోట్లు 2014-15 రెవిన్యూ లోటు నిధులు కేంద్రం నుండి తెచ్చుకుని జగన్ గారు ఎవరికి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం మొదటి దశపూర్తికి అవసరమైన నిధులు కేంద్రం ఆమోదించినందుకు జగన్ గారు ధన్యవాదాలు ఎవరికి తెలుపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, మౌలిక సదుపాయాలు కల్పన లేకుండానే మచిలీపట్టణం పోర్ట్ , రామాయపట్టణం పోర్ట్ నిర్మాణం జరుగుతుందా? బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం పూర్తి చేయడానికి సహకరిస్తున్నా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు మారిపోయి నిర్మాణ వేగం మందగించి ఆలస్యం చేస్తుంది. 2019 ముందు 72 శాతం పోలవరం నిర్మాణ పనులు వేగంగా జరిగినా, ప్రస్తుతం ఆ వేగం పూర్తిగా మందగించింది అనే విషయాన్ని సుస్పష్టం. రాష్ట్రంలో రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం వేగంగా పోలవరం పనులు పూర్తి చేస్తుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా బొప్పిడి సభకు సమీపంలో నిర్ళించిన ఎయిమ్స్, ఆచార్య రంగా వ్యవసాయ యూనివర్సిటీ తో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్ని సంస్థలు, విద్యాలయాలను ప్రస్తావించడం ద్వారా ప్రజలకు ప్రధాని మోడీ గారు వాస్తవాలను ఆవిష్కరించారు. కేంద్ర ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల మళ్లింపుతో పంచాయితీల అభివృద్ధిని జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిరోధించడం నిజమో కాదో అందరికీ తెలుసు. రాష్ట్రానికి 5 పారిశ్రామిక నోడ్లు విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో మరియు రెండు నిమ్జ్ లు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తే ప్రభుత్వ భూమి ఉండి కేటాయించని అసమర్థ ప్రభుత్వo జగన్ గారు నడిపారు.
పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆంధ్ర ప్రదేశ్ లో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2.67 కోట్ల మంది, పీఎం ఆవాస్ యోజన ద్వారా 25 లక్షల గృహాలు, 1.57 కోట్ల అయుష్మాన్ భారత్ కార్డులు, జల్ జీవన్ మిషన్ ద్వార 95 లక్షల గ్రామీణ గృహాలకు కుళాయి ద్వారా సురక్షిత త్రాగు నీరు అందించే లక్ష్యం, 50 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి క్రింద సంవత్సరానికి 6000 రూపాయలతో పాటు ప్రతి ఎరువు బస్తా పైన 2000 రూపాయల సబ్సిడీ కోసం ఆంధ్ర ప్రదేశ్ కి సంవత్సరానికి 15 వేల కోట్ల రూపాయిలకు పైగా భారం కేంద్రం మోస్తుంది. జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ఆంధ్ర ప్రదేశ్ కి సంవత్సరానికి 16 వేల కోట్ల రూపాయిలకు పైగా భారం కేంద్రం మోస్తుంది. ప్రస్తుతం రాష్ట్రానికి కేంద్రం నుండి 80 నుండి 85 వేల కోట్ల రూపాయలు వరకు కేంద్ర పన్నులలో భాగం, గ్రాంట్లు , వివిధ పథకాల క్రింద రాష్ట్రానికి సహాయం అందుతున్న వాస్తవాలు చప్పాలి అంటే జగన్ గారికి ధైర్యo ఉండాలి.
ఇప్పటికే దేశంలో అత్యధిక “ లాక్ పతి దీదీ “ లు 13.65 లక్షలు తయారు కావడం, పీఎం విశ్వకర్మ యోజన క్రింద దాదాపు 2 లక్షల మంది రిజిస్టర్ కావడం, వీది వ్యాపారుల కోసం “ పీఎం స్వనిధి “ ద్వార 4 లక్షలకు పైగా వ్యాపారులకు సబ్సిడీ రుణాలు ఇస్తుంటే ఈ పథకాల పైన రాష్ట్రంలో పాలకులు వారి పేర్లు లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లతో స్టిక్కర్లు వేస్తున్నది నిజం అని చెప్పే దమ్ము జగన్ గారికి ఉందా?
రాష్ట్రంలో పేదలకు, రైతులకు అందుతున్న సంక్షేమంలో సగటున 60% కేంద్రం నుండే అని ప్రజలకు అర్థం అవుతుంది. రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే ల మౌలిక సదుపాయాల. అభివృద్ధి పైన చర్చ పెడితే రాష్ట్రప్రభుత్వ అలసత్వ భండారం బయటపడుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి ఒక అన్నా, ఒక చెల్లి మధ్యలో తల్లి నాటకానికి తల్లి పిల్ల కాంగ్రెస్ ల సంయుక్త నాటకం ప్రధాని బయటపెట్టారు. కాంగ్రెస్ విష వృక్షంలోని విత్తనం జగన్ గారు, ఆ విత్తనం అవినీతి అరాచక మొక్కగా మొదలై నేడు ఊడలు తిరిగిన అతిపెద్ద మానుగా మారి రాష్ట్రాన్ని కబళిస్తుంటే భాద్యత కలిగిన రాష్ట్ర పౌరులు ఎవరు గతాన్ని తవ్వుకుంటూ వర్తమాన భాద్యతను విస్మరించి రాష్ట్ర భవిష్యత్ ను నిర్వీర్యం కావడానికి ఒప్పుకోరు. కేంద్రం సహకార సమైఖ్య స్పూర్తితో సహకరిస్తే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వినియోగించుకొని రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా వారి స్వంత వారి జేబులు నింపే పనిలో పడిపోయారనే భావన ప్రజలలో ఉంది.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
జనసేన అధినేత గౌరవ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ గారు.
నేడు మాజీ ఎమ్మేల్యే వర్మ గారు అధ్యక్షతన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వర్మ గారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా జనసేన గెలుపుకు కష్టపడాలని పిలుపునిచ్చారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మన అందరమూ కలిసి పని చేయాలనీ, రాబోయే ఎన్నికల్లో గౌరవ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గించి చంద్రబాబు నాయుడు గారు గౌరవం కాపాడాలని తెలిపారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాగానే మొదటి విడతలో MLC చేసి, క్షత్రియులు కోటాలో ప్రమోషన్ ఇచ్చి నన్ను గుర్తించడం జరుగుతుందని అన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గౌరవ చంద్రబాబు నాయుడు గారిని నిన్నటి రోజున ఉండవల్లిలో కలిసి పురుషోత్తపట్నం తిరిగి ప్రారంభించడం, ఏలేరు ఆధునీకరణ (సుద్దగడ్డ కొండకాలువ) కు నిధులు ఇచ్చి ముంపు నుండి ప్రజలను, పంట పొలాలను కాపాడాలని కోరడం జరిగింది. అదే విధంగా మత్స్యకారు తీరప్రాంతం కోతకు గురికాకుండా జియోట్యూబ్ ఏర్పాటు చేయాలనీ, నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు పూర్తీ చేయాలనీ కోరడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో మరింత అభివృద్ధి పరచాలని కోరారు.
గౌరవ చంద్రబాబు గారు ఆదేశాలు మేరకు జగన్ ను రాష్ట్రం నుండి పారద్రోలాలని, నువ్వు సహకరించాలని జనసేన అధినేత వారికీ, వారు కోరిన విధంగానే నువ్వు కూడా త్యాగం చేసావని, గత 18 ఏళ్ళుగా పార్టీకి సేవలు చేస్తూ, కుటుంబం అంతా ప్రజల్లో, వారి కష్టాలలో నిరంతరం శ్రమిస్తూన్నారని అభినందించారు. రైతులు కోసం అహర్నిశలు శ్రమించావు, నేటికి కూడా రైతులు కోసమే ఆలోచిస్తున్నావు. ప్రజలను, కార్యకర్తలను కాపాడే భాద్యత నాదని వర్మ గారు హామీ ఇచ్చారు.
ఇది చదవండి : రైల్వే కోడూరు సీటు ఎస్సీ మాదిగలకే – నగిరి పాటి సంతోష్
నేడు గొల్లప్రోలు టౌన్ జనసేన నాయకులు శ్రీ.కడారి తమ్మయ్యనాయుడు గారు పిఠాపురం టౌన్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మేల్యే వర్మ గారిని మర్యాదపూర్వకంగా కలిసి, మీరు తీసుకున్న నిర్ణయం పిఠాపురం ప్రజలు భవిష్యత్తు మారుతుందని చెప్పి అభినందనలు తెలిపారు, అదే విధంగా పిఠాపురం జనసేన సైనికులు వర్మ గారిని కలిసారు, గొల్లప్రోలు మండలం చెందుర్తి, తాటిపర్తి, మరియు చిన్న జగ్గంపేట గ్రామాలు పిఠాపురం మండలం చిత్రాడ, కొత్తపల్లి మండలం ఉప్పాడ పంచాయతి సుబ్బంపేట గ్రామాలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులుతో సమావేశమై జనసేన అధినేత శ్రీ.పవన్ కళ్యాణ గారిని బారీ మెజారిటీతో నెగ్గించాలని సూచించారు. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు తూచ తప్పకుండా మన సొంత ఎలక్షన్ లా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి నెగ్గించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అనుభంద కమిటి సభ్యులు, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్సిలు, మండల, టౌన్ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జులు, అసెంబ్లీ యువత, TNSF, TNTUC ప్రెసిడెంట్స్, కౌన్సిలర్ లు, సర్పెంచ్ మరియు MPTC సభ్యులు, మాజీ ZPTC, MPTC, సర్పెంచ్ మరియు కౌన్సిలర్ లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి