Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh జనసేనాని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..

జనసేనాని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..

by Prakash
Social Media

సోషల్ మీడియా (Social Media) :

జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా (Social Media)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఓ ఆంగ్ల దినపత్రికను చూస్తున్నప్పటి ఫొటో పంచుకున్నారు. ఆ పేపర్లో మోదీ స్పీచ్ తాలూకు బ్యానర్ ఐటమ్ ఉంది. ‘ఇది మోదీ హామీ… అవినీతికి పాల్పడిన వారు జైలుకే’ అన్నది ఆ పేపర్లోని కథనం శీర్షిక. దీనిపై పవన్ స్పందిస్తూ… “విజయవాడ ఎయిర్ పోర్టులో విమానం కోసం వేచిచూస్తుండగా ప్రత్యేకించి ఈ హెడ్ లైన్ నా దృష్టిని ఆకర్షించింది. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తామంటూ గౌరవనీయ ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

ఇది చదవండి : జగన్ పులివెందుల పులి కాదు…పిల్లి!- వైఎస్ షర్మిలా రెడ్డి


ప్రియమైన వైసీపీ… ఇది మీ సీఎంకు కూడా వర్తిస్తుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే… అది ఎన్నికలకు ముందు జరుగుతుందా, లేక ఎన్నికలు అయిపోయాక జరుగుతుందా? వైసీపీ సర్కారును సాగనంపి, బీజేపీ-టీడీపీ-జనసేనతో కూడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు” అంటూ పవన్ ట్వీట్ చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జనసేనాని సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..
Advertisements

You may also like

Our Visitor

019465
Total views : 90764

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.