సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో భేటీ కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, మూసీ ప్రక్షాళన ఫేజ్-1 పనులు, మెట్రో విస్తరణతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు,కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డుల అంశాలు, తుమ్మడి హట్టి పథకం, కాళేశ్వరం పంపుల నిర్వహణ అంశాలపైన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలినినో తో నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోతున్న పరిస్థితులను సమీక్షించి, కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.
31





Total views : 212536