ఏపీ సీఎం జగన్(CM Jagan) పులివెందుల(Pulivendula) అసెంబ్లీ స్థానానికి నామినేషన్(Nomination) వేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ(Public meeting)లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. వైఎస్ఆర్(YSR) వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నామని పరోక్షంగా షర్మిల(Sharmila)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మహానేతకు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలు కాదా అన్నారు. వైఎస్ ఆర్ చనిపోయాక ఆయన కుంటుంబం మీద కుట్రలు చేసింది ఎవరూ అని జగన్ ప్రశ్నించారు.
ఇది చదవండి: నేడు పులివెందులలో బీటెక్ రవి నామినేషన్…
వైఎస్ఆర్ అనే పేరు లేకుండా చేయాలని కోరుకుంటున్నది ఎవరు? అని ప్రశ్నించారు. మన శత్రువులతో కలిసి.. వారి పార్టీలో చేరిపోయిన వాళ్లా వైఎస్ ఆర్ వారసులు షర్మిలకు కౌంటర్ ఇచ్చారు. పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుట్రలో భాగమవుతున్న వీళ్లా వైఎస్ఆర్ వారసులు అని మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎవరు? అని క్వశ్చన్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- భారీ వర్షాలకు పెరుగుతోన్న గోదావరి ఉధృతిగోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో క్షణక్షణానికీ ప్రవాహం పెరుగుతోంది. ఏపీలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం 14.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అన్ని గేట్లు ఎత్తి 13.27…
- శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపితిరుమల శ్రీవారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అర్చన సేవలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ…
- తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబుప్రజల కోసం తాను జీవితాంతం పని చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తొమ్మిదోరోజు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉంటానని హామీ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.